జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిజంగానే ఏది చేసినా ప్రత్యేకమే. సినిమాల్లో స్టెప్పులేసినా…అదిరేటి డైలాగులు చెప్పినా..డూప్ లు లేకుండా స్టంట్ లలో పాల్గొన్నా… ఇలా ఏ విషయం తీసుకున్నా పవన్ ది ఓ ప్రత్యేక రేంజే. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే… పవన్ ను మించిన హీరో లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రత్యేక శైలిని పవన్ కొనసాగిస్తున్నారు. ఏ పని చేసినా ఇతర నేతలకు విభిన్నంగా సాగుతున్న పవన్.. ఆయా పనులను తనదైన శైలిలో పూర్తి చేస్తూ ప్రజాదరణలో దూసుకుపోతున్నారు.
ఇలాంటి క్రమంలో శుక్రవారం మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ చిన్నవేడుకకు సంబంధించిన ఫొటోలను చూస్తుంటే… నిజంగానే ఈ తరహా ఆతిధ్యం గానీ, ఆప్యాయతను గానీ, పవన్ ఆతిథ్యాన్ని స్వీకరించిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు ముఖంలో కనిపించిన తృప్తిని గానీ ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. తన కోసం వేసుకున్న నులక మంచం మీద పేరంటాలును కూర్చోబెట్టుకుని స్వయంగా ఆమెకు వడ్డించి తాను వడ్డించుకుని… పేరంటాలుకు కొసరికొసరి వడ్డించి మరీ ఆమె కడుపు నింపిన పవన్ ఆ తర్వాత ఆమెకు చీర, రూ.1 లక్ష నగదు ఇచ్చి… బయటకు వెళ్లి వీడ్కోలు పలికిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ చేత ఇంతటి ఆతిథ్యం, ఆప్యాయతను పొందిన పేరంటాలు ఎవరు?… ఆ కథాకమామీషు ఏమిటన్న వివరాల్లోకి వెళితే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ గెలవాలని పిఠాపురం పరిధిలోని యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పేరంటాలు తన కుల దైవం అయిన వేగులమ్మ తల్లికి ప్రత్యేకంగా మొక్కుకున్నారట. పవన్ ను గెలిపిస్తే..పొర్లు దండాలతో పాటుగా అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారట.
పేరంటాలు మొక్కు బలమో, ఇంకేమిటో తెలియదు గానీ… పిఠాపురం నుంచి పవన్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఈ క్రమంలో మొక్కు తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న పేరంటాలు.. తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్ లో నుంచి ప్రతి నెల రూ.2,500 పక్కనపెట్టి.. మొత్తం రూ.27 వేలు కూడబెట్టి… దానితో అమ్మవారికి గరగ చేయించారు. ఈ విషయం తెలిసిన పవన్ పేరంటాలు గురించి ఆరా తీయగా.. పవన్ తో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిపారట. తన విజయం కోసం 96 ఏళ్ల వయసున్న వృద్ధురాలు పొర్లు దండాలు, పింఛన్ డబ్బులతో అమ్మవారికి గరగ చేయించిన తీరుతో అప్పటికే ఆశ్చర్యానికి గురైన పవన్… ఆమెను తన. వద్దకు పిలిచి మరీ జీవితంలో మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చి… అంతకుమించిన ఆప్యాయతను అందించి పంపారు.
This post was last modified on May 9, 2025 7:05 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…