Political News

‘జడ్ ప్లస్’లో జగన్ కు నిరాశ!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ రించాలని దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం లైట్ తీసుకుందని చెప్పక తప్పదు. సీఎంగా ఉండగా… తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగిందని, అయితే విపక్షంలోకి మారిన తర్వాత తనకు ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కేంద్రం తన భద్రత స్థాయిని తగ్గించిందని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు. తనకు ముప్పు పొంచి ఉందన్న జగన్… తక్షణమే తనకు ఇదివరకటి మాదిరిగానే జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని కోర్టును కోరారు.

గురువారం దాఖలైన ఈ పిటిషన్ పై శుక్రవారమే హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా పిటిషన్ దాఖలైన మరునాడే జరిగిన ఈ విఛారణలోనూ కోర్టు ఇటు జగన్ వాదనతో పాటుగా అటు కేంద్ర ప్రభుత్వ వాదనను కూడా సావదానంగా విన్నది. ఈ క్రమంలో కోర్టు ఈ విషయాన్ని ఈ రోజే తేల్చేస్తుందని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంటే… వేసవి సెలవులు ముగిసిన తర్వాత అంటే… హీనపక్షం నెల సమయమైనా పడుతుంది కదా.

క్షణాల్లో కోర్టు నుంచి తీర్పు వస్తుందనుకుంటే… ఇలా జరిగిందేమిటీ? అంటూ జగన్ తో పాటుగా వైసీపీ నేతలు కూడా షాక్ కు గురయ్యారని చెప్పక తప్పదు. సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత జగన్ పెద్దగా బయటకే రావడం లేదు. ఏదో కొన్ని తప్పనిసరి కార్యక్రమాలు ఎంపికచేసుకుని వాటికి మాత్రమే ఆయన హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాల్లోనూ ఆయన పోలీసులు జారీ చేస్తున్న ఆదేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనలు లేకపోలేదు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్లినా…పోలీసు అదికారులు వైసీపీ శ్రేణులను వేధిస్తున్నాయని ఆరోపిస్తూ తాము అదికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలూ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… సీఎంగా ఉండగా తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించిందని పిటిషన్ కోర్టుకు జగన్ గుర్తు చేశారు. అయితే విపక్ష నేతగా మారిన వెంటనే తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన భద్రతను కుదించారని ఆరోపించారు. ఫలితంగా తన భద్రతకు ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలో తక్షణమే తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాస్తే అటు నుంచి స్పందన రాలేదని, అందుకే కోర్టుకు రావాల్సి వచ్చిందని తెలిపారు. కేంద్రం నుంచి స్పందన రాకపోతే.. సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినియోగిచుకునేందుకు అనుమతించాలని ఆయన కోరారు. మరి వేసవి తర్వాత కోర్టు ఏం చెబుతుందో చూడాలి.

This post was last modified on May 9, 2025 6:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

23 minutes ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

23 minutes ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

1 hour ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

4 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

4 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

6 hours ago