విజయవాడకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ జనసేన నేత.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న పోతిన వెంకట మహేష్కు తొలి అడుగులోనే సెగ పుట్టింది. గత ఎన్నికల సమయంలో విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలని భావించిన పోతినకు .. పార్టీ అధిష్టానం శ్రీముఖం చూపించింది. దీంతో నాలుగు మాటలు అనేసి.. ఆ వెంటనే వైసీపీలోకి జంప్ అయ్యారు. అప్పటి ఉంచి ఖాళీగా ఉన్న పోతినకు ఇటీవల వైసీపీ అధినేత కీలక బాధ్యతలు అప్పగించారు.
గుంటూరు పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్గా పోతినకు జగన్ చాన్స్ ఇచ్చారు. దీంతో సహజంగానే ఉత్సాహంగా ఉండే.. పోతిన ఈ అవకాశం రావడంతో ఎగిరి గంతేశారు. ఆ వెంటనే జగన్కు కూడా ఆయన అభినందనలు తెలిపారు. కీలక బాధ్యతలు అప్పగించారని.. పార్టీని పరుగులు పెట్టిస్తానని కూడా చెప్పారు. జగన్ అలా జాబితా విడుదల చేయగానే.. పార్టీ కార్యాలయంలో ఇలా సమావేశం ఏర్పాటు చేసి.. తనపై నమ్మకం ఉంచిన జగన్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
కట్ చేస్తే.. తాజాగా పోతిన మహేష్.. గుంటూరులో వైసీపీ రాజకీయాలను చక్కదిద్దేందుకు రెడీ అయ్యారు. పార్టీని బలంగా విస్తరించేందుకు.. నాయకులను బుజ్జగించి లైన్లో పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన కొందరు నాయకులకు ఫోన్లు చేశారు. పార్టీ పరిస్థితిని తెలుసుకుని.. దానికి తగిన విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే.. పోతిన చేసిన ఫోన్లకు ఒకరిద్దరు తప్ప.. ఎవరూ స్పందించలేదని సమాచారం.
పైగా.. సీనియర్లుగా ఉన్నవారు.. ఎవరూ పోతిన ఫోన్లను లిఫ్ట్ చేయలేదని తెలిసింది. దీంతో ఆయన హర్ట్ అయినా.. వెంటనే తనను తాను సమర్థించుకుని.. స్వయంగా గుంటూరుకు వెళ్లేందుకు ముహూర్తం పెట్టు కున్నారు. అప్పుడు అందరనీ కలిసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ.. మరోవైపు.. సీనియర్లుగా ఉన్న నాయకులు.. ఎక్కడో పార్టీ నుంచి వచ్చిన జూనియర్కు.. ఇక్కడ బాధ్యతలు అప్పగించడం ఏంటన్న చర్చ పెట్టారు. ఈ కారణంగానే.. నాయకులు ఫోన్లు ఎత్తలేదని తెలిసింది. మరి ఈ వివాదాన్ని పోతిన ఎలా సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారో చూడాలి.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…