Political News

అమరావతి మూలపాడు దశ తిరుగుతుంది

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా నగరం (స్పోర్ట్స్ సిటీ) కోసం కూటమి సర్కారు ప్రాథమిక ప్రతిపాదనలు రూపొందించడం, వాటిలో కొన్ని లోటుపాట్లు ఉండగా… వాటిని సరిదిద్దడం, ఆ సరిదిద్దిన ప్రతిపాదనల మేరకు నాలుగు గ్రామాల రైతులు తమ భూములను స్సోర్ట్స్ సిటీ కోసం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం… ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఈ మేరకు రాజధాని నిర్మాణం కోసం ఇదివరకే సేకరించిన 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాలు కాకుండా… అదనంగా మరో 4 గ్రామాలను ఎంపిక చేసి… వాటిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. కూటమి ప్రభుత్వం ఇలా ప్రతిపాదించగానే…తమ గ్రామాల పరిధిలో రాజదాని నగరం అయిన స్పోర్ట్స్ సిటీ వస్తోందంటే… అంతకంటే ఏం కావాలన్న భావనతో ఆ 4 గ్రామాల రైతులు తమ భూములను భూసమీకరణ పద్ధతిలోనే ఇచ్చేందుకు గ్రామసభల్లో ఆమోదం తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కానుంది. గతంలో కృష్ణా నదీ తీరానికి అత్యంత సమీపాన ఉన్న చినలంక, పెదలంక గ్రామాలను స్పోర్ట్స్ సిటీ కోసం పరిశీలించగా.. వరద ముంపు ప్రమాదం పొంచి ఉండటంతో ప్రభుత్వం వీటిని వద్దనుకుంది. ఆ వెంటనే ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్న మూలపాడు పరిపర గ్రామాలపై దృష్టి సారించి ఎట్టకేలకు స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదనలను పూర్తి చేసింది.

హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ మూలపాడు వద్దే కృష్ణా నది మీద అమరావతికి ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మూలపాడు కేంద్రంగా స్పోర్ట్స్ సిటీ నిర్మాణం అమరావతికి మరింత శోభను తీుకొస్తుందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అమరావతి ఎంట్రీలోనే స్పోర్ట్స్ సిటీ జనానికి స్వాగతం పలికితే ఆ ఆహ్వానమే అదిరిపోతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి

This post was last modified on May 9, 2025 10:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

3 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

3 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

3 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

4 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

5 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

7 hours ago