Political News

ఏపీ లిక్క‌ర్ స్కాం.. ఈడీ ఎంట్రీ..

ఏపీని కుదిపేస్తున్న లిక్క‌ర్ కుంభ‌కోణం వ్య‌వ‌హారంపై ఇప్పుడు కేంద్రం ప‌రిధిలోని ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ దృష్టి పెట్టింది. ఏపీ మ‌ద్యం కుంభ‌కోణంలో ఏం జ‌రిగిందో త‌మ‌కు వివ‌రాలు ఇవ్వాల‌ని లిక్క‌ర్ స్కామ్‌ను విచారిస్తున్న ప్రత్యేక ద‌ర్యాప్తు బృందానికి లేఖ రాసింది. దాదాపు 3200 కోట్ల రూపాయ‌లకు పైగా నిధులు చేతులు మారాయ‌ని.. మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం భావిస్తోంది.

దీనిలో అనేక మంది పాత్ర ఉంద‌ని, లిక్క‌ర్ ద్వారా అందిన సొమ్ములు.. భార‌తి సిమెంట్స్‌లో ప‌ని చేస్తున్న బాలాజీ గోవింద‌ప్ప‌.. ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మొ త్తం 3 వేల కోట్ల కు పైగా సొమ్ము ఎటు పోయింది? ఎవ‌రి ఖాతాలోకి చేరింద‌నే విష‌యాలు కీల‌కంగా మారా యి. వాస్త‌వానికి ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. ఈడీకి లేఖ రాస్తుంది. ద‌ర్యాప్తు చేయాల‌ని కోరుతుంది. కానీ, ఇక్క‌డ ఈడీనే విష‌యంపై ఆసక్తి చూపింది.

మద్యం కేసుకు సంబందించిన వివరాలను అందజేయండి అని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందానికి నేతృ త్వం వ‌హిస్తున్న‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్ ను ఈడీ అదికారులు కోరారు. మనీలాండరింగ్‌ నిరోధక చ ట్టం-2002 ప్రకారం తాము కూడా జోక్యం చేసుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌రిగిన విచార‌ణ‌, నిందితుల వాంగ్మూలం వంటివి కీల‌కంగా మార‌నున్నాయి. వీటిని ఈడీకి అందించేందుకు సిట్ అధికారులు రెడీ కానున్నారు.

మ‌రో వైపు.. హైకోర్టు కూడా ఈకేసును తీవ్రంగా ప‌రిగ‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ కోరిన ధ‌నుంజ‌య్‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు బెయిల్ నిరాక‌రించింది. అంతేకాదు.. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. త‌ప్ప నిజాలు బ‌య‌ట‌కు రావ‌ని కూడా పేర్కొంది. 3 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే మ‌నీ లావాదేవీలు జ‌రిగాయ‌న‌డానికిప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని కూడా హైకోర్టు పేర్కొంది. మ‌రోవైపు.. సుప్రీంకోర్టులోనూ తాజాగా వీరికి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ వెంట‌నే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. సో.. మొత్తంగా చూస్తే.. వైసీపీ లిక్క‌ర్ కుంభ‌కోణం పెద్ద కేసుగానే మారుతోంది.

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

1 hour ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

2 hours ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

2 hours ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

4 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

4 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago