ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో తమకు వివరాలు ఇవ్వాలని లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి లేఖ రాసింది. దాదాపు 3200 కోట్ల రూపాయలకు పైగా నిధులు చేతులు మారాయని.. మనీ లాండరింగ్ జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది.
దీనిలో అనేక మంది పాత్ర ఉందని, లిక్కర్ ద్వారా అందిన సొమ్ములు.. భారతి సిమెంట్స్లో పని చేస్తున్న బాలాజీ గోవిందప్ప.. ఇతర దేశాలకు తరలించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొ త్తం 3 వేల కోట్ల కు పైగా సొమ్ము ఎటు పోయింది? ఎవరి ఖాతాలోకి చేరిందనే విషయాలు కీలకంగా మారా యి. వాస్తవానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈడీకి లేఖ రాస్తుంది. దర్యాప్తు చేయాలని కోరుతుంది. కానీ, ఇక్కడ ఈడీనే విషయంపై ఆసక్తి చూపింది.
మద్యం కేసుకు సంబందించిన వివరాలను అందజేయండి అని ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృ త్వం వహిస్తున్న, విజయవాడ పోలీస్ కమిషనర్ ను ఈడీ అదికారులు కోరారు. మనీలాండరింగ్ నిరోధక చ ట్టం-2002 ప్రకారం తాము కూడా జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో ఇప్పటి వరకు.. జరిగిన విచారణ, నిందితుల వాంగ్మూలం వంటివి కీలకంగా మారనున్నాయి. వీటిని ఈడీకి అందించేందుకు సిట్ అధికారులు రెడీ కానున్నారు.
మరో వైపు.. హైకోర్టు కూడా ఈకేసును తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరిన ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి బాలాజీ గోవిందప్పలకు బెయిల్ నిరాకరించింది. అంతేకాదు.. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. తప్ప నిజాలు బయటకు రావని కూడా పేర్కొంది. 3 వేల కోట్ల రూపాయలకు పైగానే మనీ లావాదేవీలు జరిగాయనడానికిపక్కా ఆధారాలు ఉన్నాయని కూడా హైకోర్టు పేర్కొంది. మరోవైపు.. సుప్రీంకోర్టులోనూ తాజాగా వీరికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ వెంటనే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. సో.. మొత్తంగా చూస్తే.. వైసీపీ లిక్కర్ కుంభకోణం పెద్ద కేసుగానే మారుతోంది.
This post was last modified on May 8, 2025 9:11 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…