ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో తమకు వివరాలు ఇవ్వాలని లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి లేఖ రాసింది. దాదాపు 3200 కోట్ల రూపాయలకు పైగా నిధులు చేతులు మారాయని.. మనీ లాండరింగ్ జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది.
దీనిలో అనేక మంది పాత్ర ఉందని, లిక్కర్ ద్వారా అందిన సొమ్ములు.. భారతి సిమెంట్స్లో పని చేస్తున్న బాలాజీ గోవిందప్ప.. ఇతర దేశాలకు తరలించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొ త్తం 3 వేల కోట్ల కు పైగా సొమ్ము ఎటు పోయింది? ఎవరి ఖాతాలోకి చేరిందనే విషయాలు కీలకంగా మారా యి. వాస్తవానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈడీకి లేఖ రాస్తుంది. దర్యాప్తు చేయాలని కోరుతుంది. కానీ, ఇక్కడ ఈడీనే విషయంపై ఆసక్తి చూపింది.
మద్యం కేసుకు సంబందించిన వివరాలను అందజేయండి అని ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృ త్వం వహిస్తున్న, విజయవాడ పోలీస్ కమిషనర్ ను ఈడీ అదికారులు కోరారు. మనీలాండరింగ్ నిరోధక చ ట్టం-2002 ప్రకారం తాము కూడా జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో ఇప్పటి వరకు.. జరిగిన విచారణ, నిందితుల వాంగ్మూలం వంటివి కీలకంగా మారనున్నాయి. వీటిని ఈడీకి అందించేందుకు సిట్ అధికారులు రెడీ కానున్నారు.
మరో వైపు.. హైకోర్టు కూడా ఈకేసును తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరిన ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి బాలాజీ గోవిందప్పలకు బెయిల్ నిరాకరించింది. అంతేకాదు.. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. తప్ప నిజాలు బయటకు రావని కూడా పేర్కొంది. 3 వేల కోట్ల రూపాయలకు పైగానే మనీ లావాదేవీలు జరిగాయనడానికిపక్కా ఆధారాలు ఉన్నాయని కూడా హైకోర్టు పేర్కొంది. మరోవైపు.. సుప్రీంకోర్టులోనూ తాజాగా వీరికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ వెంటనే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. సో.. మొత్తంగా చూస్తే.. వైసీపీ లిక్కర్ కుంభకోణం పెద్ద కేసుగానే మారుతోంది.
This post was last modified on May 8, 2025 9:11 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…