ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా అందుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను ప్రభుత్వానికి మంచి మార్కులే వేస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు పాలనకు మరిన్ని మార్కులు పడేలా చేస్తోంది. అందుకే.. పింఛన్.. బాబుకు మార్కులు పెంచెన్ అనే కామెంట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దాదాపు 87 శాతం మంది పింఛను లబ్ధి దారులు చంద్రబాబుకు మార్కులు వేస్తున్నారు. తమకు ఖచ్చితంగా నగదు అందుతోందని చెబుతున్నారు.
దీనిపై తాజాగా ప్రభుత్వం సచివాలయాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. దీనిలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఎటూ స్పందించలేదని తెలిసింది. మిగిలిన 90 శాతం మంది లబ్ధిదారుల్లో 87 శాతం మంది ఆనందం వ్యక్తం చేశారు. అదేసమయంలో చంద్రబాబు స్వయంగా ఏదొ ఒక జిల్లాలో ప్రతి నెలా పాల్గొని పింఛను అందిస్తున్న తీరును కూడా మెచ్చుకున్నారు. ఇది ప్రజలకు – సీఎంకు మధ్య అనుబంధాన్ని పెంచుతుందని మెజారిటీ ప్రజలు పేర్కొన్నారు.
సో.. దీనిని బట్టి.. పింఛను విషయంలో ప్రభుత్వానికి మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు టీడీపీ నాయకులు. గత ఎన్నికలకు ముందు రూ.3000గా ఉన్న పింఛనును.. ఒకేసారి రూ.1000 పెంచి ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే. అదేసమయంలో దివ్యాంగుల పింఛనును రూ.6 వేలకు పెంచి ఇస్తున్నారు. రెండు పరిణామాలు కూడా ప్రభుత్వానికి మంచి మార్కులు వేస్తున్నాయి.
గత ఏడాది పింఛన్ల పంపిణీ నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు ప్రజలతో మమేకమవుతున్నారు. నేరుగా ఆయనే అందిస్తున్నారు. దీంతో ఈ పరిణామం కూడా.. పార్టీకి, వ్యక్తిగతంగా చంద్రబాబుకు కలిసి వస్తోందని అంటున్నారు. వాస్తవానికి ఏడాది పూర్తి కాబోతున్న ప్రభుత్వ పాలనలో మెజారిటీ సంఖ్యలో పింఛను దారులు బాబుకు మార్కులు వేయడం గమనార్హం.
This post was last modified on May 6, 2025 5:25 pm
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…
కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…