Political News

రూ.1000 పెంచిన బాబుకు మంచి మార్కులు

ప్ర‌తి నెలా 1వ తేదీన ఠంచ‌నుగా అందుతున్న ఎన్టీఆర్ భ‌రోసా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ప్ర‌భుత్వానికి మంచి మార్కులే వేస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు పాల‌న‌కు మ‌రిన్ని మార్కులు ప‌డేలా చేస్తోంది. అందుకే.. పింఛన్‌.. బాబుకు మార్కులు పెంచెన్ అనే కామెంట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దాదాపు 87 శాతం మంది పింఛ‌ను ల‌బ్ధి దారులు చంద్ర‌బాబుకు మార్కులు వేస్తున్నారు. త‌మ‌కు ఖ‌చ్చితంగా న‌గ‌దు అందుతోంద‌ని చెబుతున్నారు.

దీనిపై తాజాగా ప్ర‌భుత్వం స‌చివాల‌యాల నుంచి నివేదిక‌లు తెప్పించుకుంది. దీనిలో కేవ‌లం 10 శాతం మంది మాత్ర‌మే ఎటూ స్పందించ‌లేదని తెలిసింది. మిగిలిన 90 శాతం మంది ల‌బ్ధిదారుల్లో 87 శాతం మంది ఆనందం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు స్వయంగా ఏదొ ఒక జిల్లాలో ప్ర‌తి నెలా పాల్గొని పింఛ‌ను అందిస్తున్న తీరును కూడా మెచ్చుకున్నారు. ఇది ప్ర‌జ‌ల‌కు – సీఎంకు మ‌ధ్య అనుబంధాన్ని పెంచుతుంద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు పేర్కొన్నారు.

సో.. దీనిని బ‌ట్టి.. పింఛ‌ను విష‌యంలో ప్ర‌భుత్వానికి మంచి మార్కులే ప‌డ్డాయ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రూ.3000గా ఉన్న పింఛ‌నును.. ఒకేసారి రూ.1000 పెంచి ప్ర‌భుత్వం ఇస్తున్న విష‌యం తెలిసిందే. అదేస‌మయంలో దివ్యాంగుల పింఛ‌నును రూ.6 వేల‌కు పెంచి ఇస్తున్నారు. రెండు ప‌రిణామాలు కూడా ప్ర‌భుత్వానికి మంచి మార్కులు వేస్తున్నాయి.

గ‌త ఏడాది పింఛ‌న్ల పంపిణీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. నేరుగా ఆయ‌నే అందిస్తున్నారు. దీంతో ఈ ప‌రిణామం కూడా.. పార్టీకి, వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబుకు క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఏడాది పూర్తి కాబోతున్న ప్ర‌భుత్వ పాల‌న‌లో మెజారిటీ సంఖ్య‌లో పింఛ‌ను దారులు బాబుకు మార్కులు వేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 6, 2025 5:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

21 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago