రెడ్డినేతలందు.. ఈ రెడ్డి వేరయా! అని అనిపిస్తున్నారు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. హార్డ్ కోర్ జగన్ అభిమాని అయిన కోటంరెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి టీడీపీ సైకిల్ ఎక్కారు. వాస్తవానికి టీడీపీ అంటేనే అనేక మంది నాయకులు, కార్యకర్తలు.. అనేక అభిప్రాయాలు.. ఉంటాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో పనులు ముందుకు సాగడం లేదు. ఈ విషయంపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి.
దీంతో తరచుగా చంద్రబాబు తన పార్టీ నాయకులకు క్లాసులు ఇస్తూనే ఉన్నారు. అయితే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నంగా కోటంరెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండానే పనులు చేస్తున్నారు. “ఒకరు మెచ్చుకోని.. లేకపోనీ.. నాకెందుకు. నేను ప్రజల కోసం పనిచేస్తున్నా” అని చెప్పే కోటంరెడ్డి.. నియోజకవర్గంలో వైసీపీ హయాం నుంచి పెండింగు లో ఉన్న పనులకు ఇప్పుడు శ్రీకారం చుట్టారు.
తాజాగా ఈ పనుల ఆమోదం కోసం సీఎం చంద్రబాబును కలిసిన కోటంరెడ్డి.. వీటిలో తనకు కేటాయించిన 35 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశానని.. మిగిలిన వాటికి కూడా నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అదే సమయంలో తనకు అప్పగించిన బాధ్యతలు కూడా నెరవేర్చానని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి పెద్ద బుక్ లెట్నే సీఎం చంద్రబాబు చేతుల్లో పెట్టారు. దీనిలో సమగ్ర వివరాలను ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నిజానికి చంద్రబాబు కూడా.. పనులు చేయాలనే చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు నివేదిక రూపంలో కూడా ఆయా పనులను అందించడంతో పాటు ప్రజలకు చేరువగా ఉన్న కోటంరెడ్డిని చూసి మురిసిపోయారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు సహకరిస్తోందని.. అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో కోటంరెడ్డి మరింత హ్యాపీగా ఫీలయ్యారు.
This post was last modified on May 6, 2025 2:17 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…