రెడ్డినేతలందు.. ఈ రెడ్డి వేరయా! అని అనిపిస్తున్నారు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. హార్డ్ కోర్ జగన్ అభిమాని అయిన కోటంరెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి టీడీపీ సైకిల్ ఎక్కారు. వాస్తవానికి టీడీపీ అంటేనే అనేక మంది నాయకులు, కార్యకర్తలు.. అనేక అభిప్రాయాలు.. ఉంటాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో పనులు ముందుకు సాగడం లేదు. ఈ విషయంపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి.
దీంతో తరచుగా చంద్రబాబు తన పార్టీ నాయకులకు క్లాసులు ఇస్తూనే ఉన్నారు. అయితే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నంగా కోటంరెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండానే పనులు చేస్తున్నారు. “ఒకరు మెచ్చుకోని.. లేకపోనీ.. నాకెందుకు. నేను ప్రజల కోసం పనిచేస్తున్నా” అని చెప్పే కోటంరెడ్డి.. నియోజకవర్గంలో వైసీపీ హయాం నుంచి పెండింగు లో ఉన్న పనులకు ఇప్పుడు శ్రీకారం చుట్టారు.
తాజాగా ఈ పనుల ఆమోదం కోసం సీఎం చంద్రబాబును కలిసిన కోటంరెడ్డి.. వీటిలో తనకు కేటాయించిన 35 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశానని.. మిగిలిన వాటికి కూడా నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అదే సమయంలో తనకు అప్పగించిన బాధ్యతలు కూడా నెరవేర్చానని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి పెద్ద బుక్ లెట్నే సీఎం చంద్రబాబు చేతుల్లో పెట్టారు. దీనిలో సమగ్ర వివరాలను ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నిజానికి చంద్రబాబు కూడా.. పనులు చేయాలనే చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు నివేదిక రూపంలో కూడా ఆయా పనులను అందించడంతో పాటు ప్రజలకు చేరువగా ఉన్న కోటంరెడ్డిని చూసి మురిసిపోయారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు సహకరిస్తోందని.. అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో కోటంరెడ్డి మరింత హ్యాపీగా ఫీలయ్యారు.
This post was last modified on May 6, 2025 2:17 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…