రెడ్డినేతలందు.. ఈ రెడ్డి వేరయా! అని అనిపిస్తున్నారు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. హార్డ్ కోర్ జగన్ అభిమాని అయిన కోటంరెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి టీడీపీ సైకిల్ ఎక్కారు. వాస్తవానికి టీడీపీ అంటేనే అనేక మంది నాయకులు, కార్యకర్తలు.. అనేక అభిప్రాయాలు.. ఉంటాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో పనులు ముందుకు సాగడం లేదు. ఈ విషయంపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి.
దీంతో తరచుగా చంద్రబాబు తన పార్టీ నాయకులకు క్లాసులు ఇస్తూనే ఉన్నారు. అయితే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నంగా కోటంరెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండానే పనులు చేస్తున్నారు. “ఒకరు మెచ్చుకోని.. లేకపోనీ.. నాకెందుకు. నేను ప్రజల కోసం పనిచేస్తున్నా” అని చెప్పే కోటంరెడ్డి.. నియోజకవర్గంలో వైసీపీ హయాం నుంచి పెండింగు లో ఉన్న పనులకు ఇప్పుడు శ్రీకారం చుట్టారు.
తాజాగా ఈ పనుల ఆమోదం కోసం సీఎం చంద్రబాబును కలిసిన కోటంరెడ్డి.. వీటిలో తనకు కేటాయించిన 35 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశానని.. మిగిలిన వాటికి కూడా నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అదే సమయంలో తనకు అప్పగించిన బాధ్యతలు కూడా నెరవేర్చానని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి పెద్ద బుక్ లెట్నే సీఎం చంద్రబాబు చేతుల్లో పెట్టారు. దీనిలో సమగ్ర వివరాలను ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నిజానికి చంద్రబాబు కూడా.. పనులు చేయాలనే చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు నివేదిక రూపంలో కూడా ఆయా పనులను అందించడంతో పాటు ప్రజలకు చేరువగా ఉన్న కోటంరెడ్డిని చూసి మురిసిపోయారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు సహకరిస్తోందని.. అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో కోటంరెడ్డి మరింత హ్యాపీగా ఫీలయ్యారు.
This post was last modified on May 6, 2025 2:17 pm
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…