రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మంత్రులకు.. చంద్రబాబు అప్పగించిన జిల్లాల్లో పనితీరు ఎలా ఉంది? నాయకులు కలిసి ముందుకు సాగుతున్నారా? ఇంచార్జ్ మంత్రులు పట్టించుకుంటున్నారా? అంటే.. లేదనేదే చంద్రబాబు మాట. తాజాగా ఆయన రెండు జిల్లాలకు చెందిన ఇంచార్జ్ మంత్రులతో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు, నాయకుల పనితీరును ఆయన సమీక్షించారు.
అయితే.. ఆశాజనకమైన పరిస్థితి అయితే.. చంద్రబాబుకు కనిపించలేదు. దీంతో ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై త్వరలోనే వర్కు షాపు నిర్వహించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. తాజాగా చంద్రబాబు ఇంచార్జ్ మంత్రుల పనితీరుపై నివేదిక అందింది.దీనిలో చాలా మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ఒక్కసారి కూడా పర్యటించలేదని తెలిసింది. ముఖ్యంగా కడప, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణాజిల్లాల్లో ఇంచార్జ్ మంత్రులు ఒక్కసారి కూడా పర్యటించలేదని సమాచారం.
దీనిపై మంత్రులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఏకరువు పెట్టారు. కృష్ణా జిల్లాలో పరిస్థితులపై చంద్రబాబు మరింత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇసుక, మద్యం, మట్టి విషయాల్లో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్.. కృష్ణాజిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పటికి ఒక్కసారి కూడా పర్యటించలేదు. దీనిని ఎత్తి చూపుతూ.. మంత్రిగా అక్కడ ఎందుకు పర్యటించలేదని ఆయనను నిలదీశారు.
ఇక, నుంచి కేటాయించిన జిల్లాలకు వాసంశెట్టి వెళ్లాలని , రాజకీయ విమర్శలకు చెక్ పెట్టాలని కూడా చంద్రబాబు సూచించారు. అదేవిధంగా విజయనగరం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత విషయంలోనూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో కేవలం ఒకే ఒక్కసారి పర్యటించడం.. కేవలం అందుబాటులో ఉన్న నాయకులతోనే ఆమె భేటీ కావడం వంటివి ఆమెకు మైనస్ అయ్యాయని.. అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని ఆమెకు సూచించారు. జిల్లాల ఇంచార్జ్ మంత్రుల పనితీరుపై ఇక నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
This post was last modified on May 6, 2025 1:52 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…