వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇక, జైలుపక్షేనా? ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదా? అంటే.. ఔననే అంటున్నారు న్యాయవాదులు. ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. దీనికి కారణం.. వంశీకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండమే నని చెబుతున్నారు.
వంశీ ప్రాతినిధ్యం వహించిన గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఇది జరిగి మూడేళ్లు దాటింది. ఈ క్రమంలో సత్యవర్థన్ అనే యువకుడు.. టీడీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వంశీ 72 వ నిందితుడిగా ఉన్నారు. కానీ, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. సత్యవర్థన్ను బెదిరించి.. భయపెట్టి., కిడ్నాప్ చేసి.. కేసును వెనక్కి తీసుకునేలా చేశారు.
ఈ కేసు ఇప్పుడు వంశీ మెడకు చుట్టుకుంది. దీనిపైనే ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే.. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇప్పటికి రెండు సార్లు పిటిషన్లు వేసినా రెండు సార్లూ.. హైకోర్టు కొట్టేసింది. పైగా బలమైన ఆధారాలు ఉన్నాయని.. సత్యవర్థన్ను మరింత భయపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి వంశీకి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ నెల 13 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింస్తూ.. విజయవాడ సీఐడీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అనుచరులకు కూడా రిమాండ్ ను ఈ నెల 13వ తేదీ వరకు పెంచింది. దీంతో సుప్రీంకోర్టులో విచారణ ముగిసి.. (ఇంకా పిటిషన్ వేయలేదు) తీర్పు వచ్చే వరకు.. వంశీకి జైలు జీవితం తప్పదని ఆయన న్యాయవాదులు చెబుతున్నారు.
This post was last modified on May 6, 2025 1:43 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…