Political News

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో బలంగా కనిపించిన జగన్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఈ షాక్ నుంచి ఇతరుల సంగతేమో తెలియదు గానీ… జగన్ అయితే ఇంకా తేరుకోలేదనే చెప్పాలి. ఎక్కువ కాలం బెంగళూరులోని తన పాలెస్ లో సేదదీరుతున్న జగన్… ఏదో తనకు వీలున్నప్పుడు తాడేపల్లి వస్తూ వెళుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు. 2027లో జగన్ పాదయాత్ర చేపడతారని… ఇది 2.0 పాదయాత్ర రేంజిలో ఉంటుందని చెప్పారు.

సోమవారం విశాఖలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో భాగంగా ప్రసంగించిన గుడివాడ… తదుపరి ఎన్నికల దాకా పార్టీ శ్రేణులను కాపాడుకునే దిశగా తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు అంటే ఎంతకాలమని ప్రశ్నించిన గుడివాడ.. ఇలా కళ్లు మూసి అలా తెరిస్తే ఐదేళ్లు గడిచిపోతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఏడాది గడిచిపోయిందని అన్నారు. ఇంకా నాలుగేళ్లు అంతే.. ఈ నాలుగేళ్లు ఓపిక పడితే అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ఆయన జోస్యం చెప్పారు. ఈ మాట తాను చెబుతున్నది కాదన్న ఆయన స్వయంగా జగనే చెప్పారంటూ గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఈ దఫా అన్యాయం జరగదని కూడా ఆయన భరోసా ఇచ్చారు.

గతంలో జరిగిన దానిని పట్టించుకోరాదని కూడా అమర్నాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుడివాడ నోట నుంచి ఓ ఆసక్తికర వ్యాఖ్య వినిపించింది. ఇష్టమున్న వారే పార్టీలో ఉండండి అంటూ ఆయన ఓ సంచలన వ్యాఖ్య చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని చెప్పిన అమర్నాథ్.. పార్టీని వీడే వారిని బతిమాలి బామాలే పరిస్తితులు అయితే లేవన్నట్లుగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్య ద్వారా ఇష్టముంటే పార్టీలో ఉండండి… లేదంటే వెళ్లిపోండి అన్నట్టుగా గుడివాడ వ్యాఖ్యలు వినిపించాయి. అనంతరం పార్టీ కమిటీలను పునర్మించుకుందామని చెప్పిన గుడివాడ… అందుకు ఓ ఏడాది సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది భారీ ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపడతామంటూ ఆయన తెలిపారు.

గత 11 నెలల కూటమి పాలన చూసిన ప్రజలు జగన్ మళ్లీ పాదయాత్ర ఎప్పుడు మొదలెడతారని అడుగుతున్నారని అమర్నాథ్ అన్నారు. 2027 వస్తే… జగనన్న పాదయాత్ర 2.0 ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ పాదయాత్రను చేపట్టాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందని గుడివాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గ్రామాలకు వెళితే.. కొత్తగా పింఛన్లు రావడం లేదని జనం చెబుతున్నారని ఆయన అన్నారు. లబ్ధిదారుల ఇళ్లలో ఎవరైనా చనిపోతేనే… ఆయా కుటుంబంలో కొత్త వారికి పింఛన్లు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేతిలో ఇప్పటికే రాష్ట్ర ప్రజలు నాలుగు సార్లు మోసపోయారన్న గుడివాడ…ఐదో సారీ బాబు చేతిలో మోసపోతే ఇక దేవుడు కూడా ప్రజలను రక్షించలేరన్నారు.

This post was last modified on May 5, 2025 10:29 pm

Share

Recent Posts

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

47 minutes ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

2 hours ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

2 hours ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

4 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

4 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

6 hours ago