Political News

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సోమ‌వారం సాయంత్రం దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌ను అలెర్ట్ చేసింది. ప్ర‌జ‌లు ఏ విప‌త్క‌ర ప‌రిస్థితినైనా ఎదుర్కొనేలా.. శిక్ష‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాల‌కు తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలో రాష్ట్రాల వ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను నిర్వ‌హించాల‌ని పేర్కొంది. వ‌రుస‌గా మూడు రోజుల పాటు మాక్ డ్రిల్ చేప‌ట్టి.. ర‌క్ష‌ణ, స్వీయ భ‌ద్ర‌త విష‌యాల్లో ప్ర‌జ‌ల‌కు త‌ర్ఫీదునివ్వాల‌ని ఆదేశించింది.

ఈ కార్య‌క్ర‌మంలో పౌరులు, విద్యార్థులు, ప్ర‌జాసంఘాల నాయ‌కులు, అన్ని పార్టీల వారిని మిళితం చేయాల‌ని కేంద్ర ప్ర‌బుత్వం స్ప‌ష్టం చేసింది. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. త‌మ‌ను తాము కాపాడుకునేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండేలా రాష్ట్రాలే చొరవ చూపాల‌ని తెలిపింది. ఈమేర‌కు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు రక్ష‌ణ‌, హోం శాఖ‌ల నుంచి కీల‌క స‌మాచారం అందించింది. దీనిలో భాగంగా అగ్ని మాప‌క శాఖ‌ల‌ను కూడా అప్ర‌మ‌త్తం చేసింది. అగ్నిమాప‌క శ‌క‌టాల‌ను ప‌దే ప‌దే ప‌రిశీలించాల‌ని, ఉద్యోగుల‌కు వ‌చ్చే 15 రోజుల పాటు అంద‌రూ అందుబాటులో ఉండేలా షెడ్యూల్ త‌యారు చేసుకోవాల‌ని పేర్కొంది.

ఎందుకిలా?

దేశంలో ఇలా.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డం ఇటీవ‌ల కాలంలో ఇదే తొలిసారి. గ‌తంలో దాదాపు 50 ఏళ్ల కింద‌ట‌ పాకిస్థాన్‌తో భార‌త్ యుద్ధం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. చైనాతో వివాదాలు తలెత్తిన‌ప్పుడు ఆహార ధాన్యాల‌ను భ‌ద్ర ప‌రుచు కోవాల‌ని అప్ప‌టి ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి రేడియోలో ప్ర‌క‌టించార‌ని అంటారు. ఆ త‌ర్వాత ఎప్పుడూ.. ఈ మేర‌కు.. ఇలా.. హెచ్చ‌రిక‌లు జారీ చేసింది లేదు. పైగా.. పాకిస్థాన్‌తో మ‌న‌కు త‌ర‌చుగా ఉద్రిక్త‌త‌లు ఉన్నా.. ఇంతగా హెచ్చ‌రించిన ప‌రిస్థితి లేదు. కానీ.. ఈ ద‌ఫా ప‌హ‌ల్గామ్ లో జ‌రిగిన ఉగ్ర‌దాడి అనంత‌రం..(గ‌త నెల 22న‌) దేశ‌వ్యాప్తంగా పాకిస్థాన్‌కు వ్య‌తిరేక ర్యాలీలు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు.. ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త్‌కు మ‌ద్ద‌తు వ‌స్తోంది.

తాజాగా ర‌ష్యా కూడా.. భార‌త్కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. మ‌రోవైపు.. త్రివిధ ద‌ళాల‌ను కూడా కేంద్రం అప్ర‌మ‌త్తం చేసి.. మాక్ డ్రిల్ చేప‌డుతోంది. ఈ క్ర‌మంలో పాకిస్థాన్‌పై భారీ వ్యూహంతోనే భార‌త్ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే పాకిస్థాన్ కూడా తాము క్షిప‌ణిదాడుల‌కు దిగ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన కేంద్రం.. ప్ర‌జ‌ల‌ను కూడా అప్ర‌మ‌త్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ఒక్క జ‌మ్ము క‌శ్మీర్‌పైనే కాకుండా.. భార‌త్‌లోకి చొచ్చుకువ‌చ్చి ఏ రాష్ట్రంపైనైనా దాడి చేస్తే.. ప్ర‌జ‌లు త‌మ‌ను తాము ర‌క్షించుకునేలా వ్యూహాత్మ‌కంగా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. 

This post was last modified on May 5, 2025 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

3 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

6 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

6 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

7 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

7 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

8 hours ago