Political News

‘విష’ ప్ర‌చారానికి ప‌నితీరే విరుగుడు బాబు గారూ..!

కూట‌మి ప్ర‌భుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప్ర‌భుత్వం ఏం చేసిందన్న విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే.. ఈ విష‌యంలో ఉన్న‌వీ లేనివీ క‌లిపి ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ విష ప్ర‌చారానికి తెర‌దీసే అవ‌కాశం ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న పార్టీ నాయ‌కుల‌ను, మంత్రుల‌ను ఆయ‌న అలెర్ట్ చేస్తున్నారు. విష ప్ర‌చారాన్ని తిప్పికొట్టేందుకు రెడీ కావాల‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు.

దీనిపై సుదీర్ఘంగా రెండు గంట‌ల‌పాటు అంత‌ర్గ‌తంగా అందుబాటులో ఉన్న కీల‌క మంత్రుల‌తోనూ చంద్రబాబు చ‌ర్చించారు. త‌మ ప్ర‌భుత్వంపై వైసీపీ చేసే విష ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని ఆయ‌న సూచించారు. దీనికి అంద‌రూ ఓకే చెప్పారు. అయితే.. అస‌లు వైసీపీ చేసే ప్ర‌చారం ఎలా ఉన్నా.. ప‌నితీరుతోనే స‌మాధానం చెప్పాల‌ని మేధావులు సూచిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక‌ప్పుడు రోడ్లు గుంత‌లు ప‌డి.. నడిచేందు కు కూడా ఇబ్బందులు ఉండేది.

దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు ఎదురు దాడి చేసేవారు. కొందరైతే.. సంక్షేమానికి సొమ్ములు కేటాయిస్తున్నందున ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు నిధులు లేకుండా పోయాయ‌ని బ‌హిరంగం గానే చెప్పారు. ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే కేసులు కూడా పెట్టారు. ఫ‌లితంగా వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంది. అదే టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక‌.. ప‌నులు చేయ‌డం ప్రారంభించింది. ర‌హ‌దారులు ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు ఎవ‌రూ విమ‌ర్శించే అవ‌కాశం లేకుండా పోయింది.

అలానే ఇప్పుడు కూడా.. ప‌నితీరుతోనే స‌మాధానం చెప్పాల‌న్న‌ది మేధావులు చెబుతున్న మాట‌. ఎందు కంటే.. మాట‌కు మాట‌.. విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా రాజ‌కీయ‌మే అవుతుంద‌ని.. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు స‌రైన సంకేతాలు అంద‌డం కూడా ఇబ్బందే అవుతుంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌ధాని అమ‌రావ‌తి స‌హా.. ర‌హ‌దారుల విష‌యంలో ఎలాంటి లైన్ తీసుకుని ముందుకు సాగుతున్నారో.. ఇప్పుడు ఇత‌ర విష‌యాల్లోనూ ప‌నితీరు ఆధారంగానే ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం మంచిద‌ని చెబుతున్నారు.

This post was last modified on May 5, 2025 5:26 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

27 minutes ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

48 minutes ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

2 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago