కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే.. ఈ విషయంలో ఉన్నవీ లేనివీ కలిపి ప్రతిపక్ష వైసీపీ విష ప్రచారానికి తెరదీసే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో తన పార్టీ నాయకులను, మంత్రులను ఆయన అలెర్ట్ చేస్తున్నారు. విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రెడీ కావాలని కూడా ఆయన చెబుతున్నారు.
దీనిపై సుదీర్ఘంగా రెండు గంటలపాటు అంతర్గతంగా అందుబాటులో ఉన్న కీలక మంత్రులతోనూ చంద్రబాబు చర్చించారు. తమ ప్రభుత్వంపై వైసీపీ చేసే విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సూచించారు. దీనికి అందరూ ఓకే చెప్పారు. అయితే.. అసలు వైసీపీ చేసే ప్రచారం ఎలా ఉన్నా.. పనితీరుతోనే సమాధానం చెప్పాలని మేధావులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒకప్పుడు రోడ్లు గుంతలు పడి.. నడిచేందు కు కూడా ఇబ్బందులు ఉండేది.
దీనిపై విమర్శలు వచ్చాయి. దీంతో అప్పట్లో వైసీపీ నాయకులు ఎదురు దాడి చేసేవారు. కొందరైతే.. సంక్షేమానికి సొమ్ములు కేటాయిస్తున్నందున ఇతర కార్యక్రమాలకు నిధులు లేకుండా పోయాయని బహిరంగం గానే చెప్పారు. ఎవరైనా విమర్శలు చేస్తే కేసులు కూడా పెట్టారు. ఫలితంగా వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంది. అదే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. పనులు చేయడం ప్రారంభించింది. రహదారులు ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు ఎవరూ విమర్శించే అవకాశం లేకుండా పోయింది.
అలానే ఇప్పుడు కూడా.. పనితీరుతోనే సమాధానం చెప్పాలన్నది మేధావులు చెబుతున్న మాట. ఎందు కంటే.. మాటకు మాట.. విమర్శలకు ప్రతివిమర్శలు చేయడం ద్వారా రాజకీయమే అవుతుందని.. తద్వారా ప్రజలకు సరైన సంకేతాలు అందడం కూడా ఇబ్బందే అవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో రాజధాని అమరావతి సహా.. రహదారుల విషయంలో ఎలాంటి లైన్ తీసుకుని ముందుకు సాగుతున్నారో.. ఇప్పుడు ఇతర విషయాల్లోనూ పనితీరు ఆధారంగానే ప్రజలకు వివరించడం మంచిదని చెబుతున్నారు.
This post was last modified on May 5, 2025 5:26 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…