“మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి” అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది. ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీల్లో ఇది కూడా ఒకటి. రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈ నెలలో శ్రీకారం చుట్టనున్నారు.
దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం లబ్ధి దారులుగా ఉన్న రైతులతో పాటు .. కౌలు రైతులను కూడా దీనిలో లబ్ధిదారులుగా చేర్చుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్క రైతులకు ఏటా 20 వేలరూపాయల చొప్పున సొమ్ములు సాయం చేయనుంది. గతంలో కౌలు రైతులకు సొమ్ములు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం నేరుగా భూ యజమానుల ఖాతాల్లో వేసింది. దీంతో కౌలు రైతులు లబోదిబో మన్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా సొమ్ములు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చే రూ.20 వేలను మూడు దఫాలుగా ఇవ్వనున్నారు. దీనిలో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన ను కూడా కలిపి అందిస్తారు. అంటే.. ప్రభుత్వం 14 వేలు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేలను కలిపి మొత్తం 20 వేలను మూడు విడతులుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు సర్కారు తెలిపింది.
ఇప్పటికే అర్హులైన వారి జాబితాలు రెడీ అయ్యాయని.. మరింత అర్హులైన వారు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అలానే.. బ్యాంకు ఖాతాలను అప్ డేట్ చేసుకోవాలని పేర్కొంది. తొలి విడతలో కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిపి.. 3600 చొప్పున రాష్ట్రం కలిపి.. బ్యాంకుల్లో జమచేయనున్నట్టు వివరించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…