“మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి” అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది. ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీల్లో ఇది కూడా ఒకటి. రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈ నెలలో శ్రీకారం చుట్టనున్నారు.
దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం లబ్ధి దారులుగా ఉన్న రైతులతో పాటు .. కౌలు రైతులను కూడా దీనిలో లబ్ధిదారులుగా చేర్చుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్క రైతులకు ఏటా 20 వేలరూపాయల చొప్పున సొమ్ములు సాయం చేయనుంది. గతంలో కౌలు రైతులకు సొమ్ములు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం నేరుగా భూ యజమానుల ఖాతాల్లో వేసింది. దీంతో కౌలు రైతులు లబోదిబో మన్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా సొమ్ములు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చే రూ.20 వేలను మూడు దఫాలుగా ఇవ్వనున్నారు. దీనిలో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన ను కూడా కలిపి అందిస్తారు. అంటే.. ప్రభుత్వం 14 వేలు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేలను కలిపి మొత్తం 20 వేలను మూడు విడతులుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు సర్కారు తెలిపింది.
ఇప్పటికే అర్హులైన వారి జాబితాలు రెడీ అయ్యాయని.. మరింత అర్హులైన వారు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అలానే.. బ్యాంకు ఖాతాలను అప్ డేట్ చేసుకోవాలని పేర్కొంది. తొలి విడతలో కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిపి.. 3600 చొప్పున రాష్ట్రం కలిపి.. బ్యాంకుల్లో జమచేయనున్నట్టు వివరించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…