Political News

అమరావతి ఒక నగరం కాదు… ఒక శక్తి: మోదీ తెలుగు పలుకులు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు అమరావతి పరిధిలోని వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద నుంచే మోదీ… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అమరావతి పనులతో పాటుగా ఏపీలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా ప్రసంగించిన మోదీ… అమరావతిని ఓ నగరంగా కాకుండా ఓ శక్తిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అని కూడా ఆయన అభివర్ణించారు. తన ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన మోదీ… తన ప్రసంగంలో పలుమార్లు తెలుగు పదాలను పలుకుతూ సభకు హాజరైన వారిని ఉర్రూతలూగించారు. 

అమరావతిని రానున్న మూడేళ్లలోనే పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ… ఆ శక్తి ఏపీ ప్రజలకు, కూటమి సర్కారుకు ఉందని తెలిపారు. పనులను చక్కబెట్టడంలోనే కాకుండా… ఆయా పనులను నాణ్యతా ప్రమాణాలతో కూడా సకాలంలో పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని కూడా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో అప్పటికే చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉన్నారని, నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు పనితనాన్ని చూశానని, దానిపై తాను అధ్యయనం చేశానని, అధికారులను పంపి అధ్యయనం చేయించానని కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రానున్న మూడేళ్లలోనే పూర్తి అవుతుందన్న నమ్మకం తనకు ఉందని కూడా మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్న మోదీ… ఆ దిశగా ఏఫీకి ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. 

అమరావతిని ఏపీకి రాజధానిగా మాత్రమే చూడదలచుకోలేదన్న మోదీ… వికసిత్ భారత్ లో భాగంగానే అమరావతిని చూడాలనుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందని చెప్పిన మోదీ… ఇదే వేగాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా మోదీ ఏపీ ప్రజల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కలలు కనే వారు ఎక్కువగా ఉన్నారన్న మోదీ… కలలను కనే వారితో పాటుగా వాటిని సాకారం చేసుకుంటున్న వారు కూడా ఏపీలో అధికంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి గతంలో కంటే మెరుగైన రీతిలో కేంద్ర నిధులను కేటాయిస్తున్నామన్న మోదీ… రైల్వే కేటాయింపుల్లోనూ ఏపీతో పాటు తెలంగాణకు కూడా భారీ ఎత్తున నిదులను కేటాయిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు కోరినట్టుగా ఈ ఏడాది ప్రచంచ యోగా దినోత్సవ వేడుకలకు తాను ఏపీకి వస్తానని కూడా మోదీ ప్రకటించారు.

This post was last modified on May 3, 2025 11:16 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయ

మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…

4 hours ago

లీకులు సరే… నెక్స్ట్ ఏంటి నాయకా

జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…

7 hours ago

అదేంటో… మోడీ స‌ర్‌కి ఎన్నిక‌ల‌ప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి!

అదేంటో కానీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌లు కీల‌క విష‌యాలు సాధార‌ణ రోజుల్లో ఎక్క‌డా గుర్తుకు ఉండ‌వు... రావు. ఎన్నిక‌ల…

7 hours ago

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

10 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

11 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

12 hours ago