Political News

అమరావతి ఒక నగరం కాదు… ఒక శక్తి: మోదీ తెలుగు పలుకులు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు అమరావతి పరిధిలోని వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద నుంచే మోదీ… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అమరావతి పనులతో పాటుగా ఏపీలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా ప్రసంగించిన మోదీ… అమరావతిని ఓ నగరంగా కాకుండా ఓ శక్తిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అని కూడా ఆయన అభివర్ణించారు. తన ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన మోదీ… తన ప్రసంగంలో పలుమార్లు తెలుగు పదాలను పలుకుతూ సభకు హాజరైన వారిని ఉర్రూతలూగించారు. 

అమరావతిని రానున్న మూడేళ్లలోనే పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ… ఆ శక్తి ఏపీ ప్రజలకు, కూటమి సర్కారుకు ఉందని తెలిపారు. పనులను చక్కబెట్టడంలోనే కాకుండా… ఆయా పనులను నాణ్యతా ప్రమాణాలతో కూడా సకాలంలో పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని కూడా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో అప్పటికే చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉన్నారని, నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు పనితనాన్ని చూశానని, దానిపై తాను అధ్యయనం చేశానని, అధికారులను పంపి అధ్యయనం చేయించానని కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రానున్న మూడేళ్లలోనే పూర్తి అవుతుందన్న నమ్మకం తనకు ఉందని కూడా మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్న మోదీ… ఆ దిశగా ఏఫీకి ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. 

అమరావతిని ఏపీకి రాజధానిగా మాత్రమే చూడదలచుకోలేదన్న మోదీ… వికసిత్ భారత్ లో భాగంగానే అమరావతిని చూడాలనుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందని చెప్పిన మోదీ… ఇదే వేగాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా మోదీ ఏపీ ప్రజల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కలలు కనే వారు ఎక్కువగా ఉన్నారన్న మోదీ… కలలను కనే వారితో పాటుగా వాటిని సాకారం చేసుకుంటున్న వారు కూడా ఏపీలో అధికంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి గతంలో కంటే మెరుగైన రీతిలో కేంద్ర నిధులను కేటాయిస్తున్నామన్న మోదీ… రైల్వే కేటాయింపుల్లోనూ ఏపీతో పాటు తెలంగాణకు కూడా భారీ ఎత్తున నిదులను కేటాయిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు కోరినట్టుగా ఈ ఏడాది ప్రచంచ యోగా దినోత్సవ వేడుకలకు తాను ఏపీకి వస్తానని కూడా మోదీ ప్రకటించారు.

This post was last modified on May 3, 2025 11:16 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

6 hours ago