టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో దినదినాభివృద్ది సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి బంపర్ విక్టరీ అందించిన లోకేశ్… ఆ తర్వాత కూడా ప్రభుత్వ పాలనలో తనదైన దూకుడుతో సాగుతున్నారు. ఓ వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం, ఇంకోవైపు కూటమిలోని మిత్రపక్షాలు… అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్న లోకేశ్ తీరు నిజంగానే అద్భుతమనే చెప్పాలి. ఈ విషయాలు తెలిసే కాబోలు… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో లోకేశ్ పట్ల ఎనలేని అప్యాయత వ్యక్తమవుతుందేమో? నిజమే మరి.. ఓ యువకుడిగా లోకేశ్ ఈ మేర సత్తా చాటుతూ ఉంటే… ఎవరికైనా ఆయనను అభినందించాలని ఉంటుంది కదా. మోదీ కూడా అదే చేస్తున్నారు.
మొన్నామధ్య విశాఖకు వచ్చిన సందర్భంగా లోకేశ్ ను తన దగ్గరకు పిలుచుకున్న మోదీ… లోకేశ్ చేతులు పట్టుకుని.. ఏదో ఓ స్నేహితుడితో సరదా గడుపుతున్నట్లుగా… లోకేశ్ చేతులను మెలి తిప్పుతూ, ఆ చేతులతో విన్యాసాలను చేయిస్తూ మోదీ సాగారు. ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలంటూ నాడు లోకేశ్ కు మోదీ స్వాగతం పలికారు. స్వయంగా ప్రధాని తనను అంత దగ్గరగా తీసుకుని…తనతో సరదాసరదాగా గడుపుతూ ఆహ్వానిస్తే లోకేశ్ కూడా కాదనలేకపోయారు. సరే సార్ త్వరలోనే వస్తానంటూ మోదీకి చెప్పారు. కట్ చేస్తే… అప్పుడే నెలలు గడిచి పోయాయి. మోదీ తన పనిలో పడిపోయారు. లోకేశ్ తన షెడ్యూల్ తో బిజీ అయిపోయారు. మోదీ ఆహ్వానానన్నే మరిచిపోయారు. ఈలోగా మోదీ మరోసారి ఏపీకి రానే వచ్చారు.
అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ శుక్రవారం నేరుగా అమరావతికే వచ్చారు. ఈ సందర్భంగా మోదీని వేదిక మీదకు ఆహ్వానించే క్రమంలో తన తండ్రి, సీఎం చంద్రబాబుతో కలిసి లోకేశ్ మోదీ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ తన ఆహ్వానం మేరకు ఢిల్లీ రాలేదన్న విషయం మోదీకి గుర్తుకు వచ్చినట్టుంది. వెంటనే లోకేశ్ చేతులను ఇదివరకటి మాదిరిరే దొరకబుచ్చుకున్న మోదీ..మరోమారు లోకేశ్ తో సరదాగా గడిపారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు… ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ రావాలని, తనను కలవాలని అని మరోమారు లోకేశ్ తో మోదీ అన్నారు. మోదీకి మళ్తీ దొరికిపోయాయనన్న భావనతో ఈ సారి తప్పకుండా వస్తానంటూ లోకేశ్ చెప్పినా…మోదీ ఆయన చేతులను అలాగే పట్టుకుని చాలా సేపు అలా సరదాగా ఉండిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి.
This post was last modified on May 3, 2025 8:53 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…