రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి అన్నగారు.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు వచ్చింది. “ఎన్టీఆర్.. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్నారు. ఆ కలలను మనం(చంద్రబాబు-పవన్-మోడీ) సాకారం చేద్దాం” అని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మోడీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ పేరును బహిరంగంగా ప్రకటించింది కానీ.. ఆయన పేరును తలుచుకున్నది కానీ.. ఎప్పుడూ లేదు. కానీ.. తాజాగా మాత్రం ఎన్టీఆర్ పేరును మూడు సార్లు ప్రస్తావించారు.
అంటే.. దీనిని బట్టి తెలుగు వారి అన్న.. గురించి మోడీకి సవివరంగా తెలిసే ఉంటుంది. లేదా..ఇప్పటికైనా ఆయన తెలుసుకుని ఉంటారు. వాస్తవానికి అన్నగారు ఉన్న సమయంలో నేరుగా మోడీ రాజకీయాల్లోకి రాలేదు. కాబట్టి.. ఆయన సీఎంగా ఉన్న సమయం గురించి మోడీకి తెలియకపోయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన గురించి గతంలో ఎప్పుడూ మోడీ వ్యాఖ్యానించలేదని అనుకోవాలి. సరే.. ఇప్పుడు కారణాలు ఏవైనా మోడీ.. పదే పదే అమరావతిలో నిర్వహించిన సభలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. చిత్రం ఏంటంటే.. మోడీ నోటి నుంచి ఎన్టీఆర్ పేరు వచ్చిన ప్రతిసారీ.. సభకు వచ్చిన ప్రజల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు కీలక అవకాశం వచ్చిందని పార్టీ అభిమానులు అంటున్నారు. అన్న ఎన్టీఆర్కు భారత రత్న తీసుకురావాలన్నది పార్టీ నాయకులే కాదు.. యావత్ తెలుగు జాతి కూడా.. పార్టీలకు కులాలకు అతీతంగా కోరుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయంలో గతంలో వైసీపీ నాయకులు కూడా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పడం కొసమెరుపు. సో.. ఇప్పుడు మోడీనే అన్నగారి పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఎన్టీఆర్ కీర్తి గురించి..ఆయన అందించిన సేవ గురించి ప్రత్యేకంగా మోడీకి చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక్క ఏపీకే కాకుండా.. తమిళనాడుకు నీటిని అందించిన ఘనత కూడా ఎన్టీఆర్ కే దక్కుతుంది. కేంద్రంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసింది కూడా ఎన్టీఆర్. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. సో.. ఇటుసేవల పరంగా.. అటు రాజకీయంగా కూడా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతం చెందారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చిన్న చిరు ప్రయత్నం చేస్తే.. చంద్రబాబు హయాంలోనే ఈ టర్మ్లోనే .. అన్నగారికి అద్వితీయమైన భారతరత్న దక్కడం పెద్ద సమస్య కాదని అంటున్నారు.
This post was last modified on May 2, 2025 10:00 pm
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…
గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…