Political News

నేను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నాను: మోడీ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. ఇది దేవేంద్రుడి రాజ‌ధాని న‌గ‌రం పేరు. దీనిని రాజ‌ధానిగా పెట్టుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. మ‌రింత అభివృద్దిని సాధించాలి. ఈ రాజ‌ధానిని మ‌నమే పూర్తి చేయాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబు.. దీనిని మ‌న‌మే పూర్తి చేయాలి అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌దే ప‌దే నొక్కి చెప్పారు. రాజ‌ధాని పనుల పున‌ర్నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాని.. అనంత‌రం స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దాదాపు 60 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప‌నుల‌కు శ్రీకారం చుట్టామ‌న్న ఆయ‌న‌.. ఈ ప‌నులు పూర్త‌య్యే వ‌ర‌కు.. తాము అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. రికార్డు వేగంతో ఈ ప‌నులు పూర్తి చేసేందుకు తాము స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపారు.

టెక్నాల‌జీ, గ్రీన్ ఎన‌ర్జీకి అమ‌రావ‌తి కేరాఫ్‌గా నిలుస్తుంద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. “విక‌సిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం ఎన్టీఆర్ క‌ల‌లుక‌న్నారు. ఆ క‌ల‌ల‌ను నిజం చేయాలి. వాటిని నిజం చేసేందుకు నేను, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కృషి చేస్తాం.. సాకారం చేస్తాం” అని ప్ర‌ధాని అన్నారు. “ఈ సంద‌ర్భంగా మీకు ఓ ర‌హ‌స్యం చెబుతున్నా. టెక్నాల‌జీని నేను ప‌రిచ‌యం చేశాన‌ని అంటారు. కానీ, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. నేను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయ‌డంలోనూ.. తీసుకురావ‌డంలోనూ చంద్ర‌బాబుకు చంద్ర‌బాబే సాటి” అని మోడీ వ్యాఖ్యానించారు.

ఏపీకి కొత్త క‌నెక్టివిటీ పెరుగుతుంద‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు. రైలు, రోడ్డు మార్గాలు మ‌రిన్ని వ‌స్తాయ‌న్నారు. రైలు ప్రాజెక్టుల‌కు కేంద్ర ప్ర‌భుత్వంగా తాము భారీ ఎత్తున నిధులు స‌మ‌కూర్చామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి పూర్త‌యితే.. ఏపీ ద‌శ -దిశ మారుతుం ద‌ని చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణంతో ప్ర‌తి ఆంధ్రుడి క‌ల నెర‌వేరుతుంద‌ని తెలిపారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఏపీకి గ్ర‌హణం వీడింది.. అని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్వ‌ర్ణాంధ్ర విజ‌న్‌కు అమ‌రావ‌తి మ‌రింత శ‌క్తినిస్తుంద‌ని తెలిపారు. “నేను, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ విక‌సిత ఏపీ కోసం కృషి చేస్తాం” అని మోడీ పేర్కొన్నారు. కాగా.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. “తల్లి దుర్గ భవానీ కొలువైన పుణ్య భూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది” అని త‌న తొలి ప‌లుకులు ప్రారంభించారు.

This post was last modified on May 2, 2025 6:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago