Political News

రీస్టార్ట్ కాదు..అమరావతి స్టార్ట్ చేసేదీ మోదీనే: చంద్రబాబు

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ మళ్లీ వస్తారని చంద్రబాబు అన్నారు. అమరావతి మా రాజధాని అని అందరూ గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని చెప్పారు.

అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహన రాజధానిగా, బౌద్ధుల అభిృద్ధికి కేంద్రంగా కష్ణమ్మ తీరాన విలసిల్లిన అమరావతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని అన్నారు. అమరావతి ఒక నగరం కాదని..అదొక సెంటిమెంట్ అని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు 39 వేల ఎకరాల భూములు ఇచ్చారని.. ఎవరినీ అసంతృప్తికి గురిచేయబోమని అన్నారు.

అమరావతి రాజధాని ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, రైతులు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని, వైసీపీ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టినా ఎక్కడా తలొగ్గలేదని ప్రశంసించారు. వైసీపీ విధ్వంస పాలనకు ఎదురొడ్డి రైతులు నిలిచారని, ప్రాణాలకు తెగించి రైతులు పోరాడి అమరావతి రాజధానిని సాధించుకున్నారని కొనియాడారు.

సరైన సమయంలో సరైన నేత దేశానికి ప్రధానిగా ఉన్నారని మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో మోదీతో భేటీ అయ్యానని, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన గంభీరంగా కూర్చొని ఉన్నారని అన్నారు. మోదీజీ ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రం చేపట్టే ప్రతి చర్యకు అండగా ఉంటాం, ఈ విషయంలో ప్రధానికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని ప్రతిజ్ఞ చేస్తున్నాం అని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. మోడీ కొత్త ఇండియాను నిర్మిస్తున్నారని, దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్న అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దేశాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రధాని మోడీ పని చేస్తున్నారని, మోడీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతుందని తెలిపారు.

This post was last modified on May 2, 2025 5:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago