Political News

ధర్మయుద్ధంలో అమరావతి రైతులదే విజయం: పవన్ కల్యాణ్

ఐధేళ్ల పాటు యుద్ధం కొనసాగితే… ధర్మం పక్షాన నిలిచి అలుపెరగని పోరాటం చేసిన అమరావతి రైతులను విజయం వరించిందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభా వేదిక మీద ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆసీనులై ఉన్న వేదిక మీద పనవ్ కల్యాణ్ తనదైన శైలి ప్రసంగం చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన మోదీనో, లేదంటే.. తనకంటే ఉన్నత స్థానంలో ఉన్న సీఎంనో తొలుత ప్రస్తావించడానికి బదులుగా పవన్ తనదైన మార్కుతో సాగారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం బంగారం పండే తమ భూములను ఇచ్చిన రైతులను పవన్ తొలుత గుర్తు చేసుకున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. గడచిన ఐదేళ్లలో రాజధాని రైతులు పడిన ఇబ్బందులను ప్రస్తావించి వారికి సంఘీభావం తెలిపారు.

ఈ రోజు అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించుకుంటున్నామంటే.. అది అమరావతి రైతుల కృషితోనే సాధ్యమైందని పవన్ అన్నారు. వేలాది ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రైతులు… తమ కళ్ల ముందు రాజధాని కల నీరుగారిపోతూ ఉంటే.. రైతులు పడిన బాధతు వర్ణనాతీతమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా రాజధాని కలను సజీవంగా ఉంచుతారా? అని నాడు తనను రాజధాని రైతులు ప్రశ్నించారని గుర్తు చేసుకున్న పవన్… ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాజధాని రైతుల కలను సజీవంగా ఉంచగలిగామని, ఇప్పుడు ఆ కలను సాకారం చేస్తున్నామని కూడా చెప్పారు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఐదేళ్లుగా లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తు చేసుకున్న పవన్… రైతుల్లో వందల మంది ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహిళా రైతులు పోలీసుల బూటు కాళ్ల దెబ్బలు తిన్నారని కూడా పవన్ నాటి ఘటనలను మననం చేసుకున్నారు.

అమరావతి అంటే… ఏదో ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో చెందినది కాదని పవన్ అన్నారు. అమరావతి అంటే… ఏపీలోని ఆరు కోట్ల మంది ప్రజల రాజధాని అని ఆయన అన్నారు. ప్రపంచంలోని 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా సాగుతున్నామని, అందుకోసం సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి ఏపీకి ఎంతో సహకారం అందుతోందని పవన్ పేర్కొన్నారు. ఈ సహకారం మరింత కాలం పాటు కొనసాగుతుందని కూడా పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రం సహకారంతో ఏపీలోని కూటమి సర్కారు అమరావతిని నిర్ణీత వ్యవధిలోగానే పూర్తి చేస్తుందని ఆయన అన్నారు. యావత్తు దేశాన్ని మోదీ తన కుటుంబంగా భావిస్తున్నారన్న పవన్… ఆ క్రమంలోనే ఏపీకి ఏది కావాలన్నా కూడా లేదనకుండా ఇస్తున్నారని అన్నారు. పవన్ ప్రసంగం ముగిసిన తర్వాత పవన్ ను తన వద్దకు పిలుచుకున్న మోదీ… ఆయన చేతిలో ఓ చాక్ లెట్ పెట్టి అభినందించారు.

This post was last modified on May 2, 2025 5:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

23 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

59 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago