Political News

చింత‌మ‌నేనా.. మ‌జాకా.. 100 బ‌స్సులు.. వెయ్యి బైకులతో అమ‌రావ‌తికి!

ఏంచేసినా త‌న‌కంటూ స్పెష‌ల్‌గా ఉండే.. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. తాజాగా ఏపీ రాజధాని అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభ ఘ‌ట్టానికి కూడా త‌న‌దైన శైలిలో స్పందించారు. ఒక్క ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచే 100 బ‌స్సుల‌ను అమరావ‌తికి త‌ర‌లించారు. అదేవిధంగా యువ‌త ముందుకు రావ‌డంతో దాదాపు వెయ్యికి పైగా బైకుల‌ను కూడా..అమ‌రావ‌తికి పంపించారు.

బ‌స్సుల్లో ఒక్కొక్క బ‌స్సుకు 30 మంది చొప్పున 3 వేల మంది, బైకుల‌పై ఇద్ద‌రేసి చొప్పున 2వేల మంది మొత్తంగా 5 వేల మందికిపైగా ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గం నుంచి అమ‌రావ‌తికి త‌ర‌లించారు. ఉరికే ఉత్సాహంతో దెందులూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా అమరావతికి తరలి వెళ్లిన కూటమి శ్రేణులు, ప్రజలు కూడా త‌ర‌లి వెళ్లారు. ఆయా బ‌స్సులు, బైకుల‌కు ఎమ్మెల్యే చింత‌మ‌నేని.. హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అంతేకాదు.. పంపించ‌డంతోనే ఆయ‌న చేతులు దులుపుకోకుండా.. దెందులూరు నియోజకవర్గం నుంచి అమరావతిలో జరిగే రాజధాని పనుల ప్రారంభ కార్యక్రమానికి వెళ్తున్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం గన్నవరం వద్ద గల ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. వెజ్‌, నాన్ వెజ్ వంట‌కాలను ప్ర‌త్యేకంగా త‌యారు చేయించారు. వేలాదిగా వాట‌ర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల‌ను స‌ర‌ఫ‌రా చేశారు.

రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పండుగ వాతావరణం లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉంద‌ని ఎమ్మెల్యే చింత‌మ‌నేని వ్యాఖ్యానించారు. కాగా.. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల నుంచి ప్ర‌జ‌లు ఉత్సాహంగా ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

2 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

2 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

5 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

8 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

8 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

8 hours ago