శత్రు దుర్బేధ్యంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో భారత్ తన సాధనా సంపత్తిని పెంచుకుంటోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్షిపణి పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచుకుంటోంది. అందులో భాగంగా ఏపీలో ఓ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం అటు జాతీయ భద్రతతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా రక్షణ కవచంగా మారనుందని చెప్పక తప్పదు. అమరావతికి కూతవేటు దూరంలో ఏర్పాటు కానున్న ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు శుక్రవారం వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి నుంచే వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
అమరావతికి అతి సమీపంలో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోద గ్రామంలో ఈ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక దశలో రూ.1,500 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ప్రధాని ఈ రూ.1,500 కోట్లతో చేపట్టే క్షిపణి పరీక్షా కేంద్రానికే వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. తదుపరి ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం మరింతగా తీర్చి దిద్దనుంది. ఇందుకోసం ఈ పరీక్షా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనుంది. అంటే… భవిష్యత్తులో భారత్ పరీక్షించనున్న దాదాపుగా అన్ని క్షిపణుల పరీక్షలన్నీ కూడా గుల్లలమోద కేంద్రం నుంచే జరగనున్నాయని చెప్పొచ్చు.
అంతరిక్ష ప్రయోగాలకు గానీ, క్షిపణి ప్రయోగాలకు గానీ… ఏపీలోని తీర ప్రాంతం అత్యంత అనుకూలమే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు అయ్యేలా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. కొత్తగా ఓ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోగానే.. ఆ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు… విషయాన్ని నేరుగా ప్రధాని వద్ద ప్రస్తావించారు. క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు గుల్లలమోద అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించడమే కాకుండా… సదరు క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుతో ఏపీకి కలిసివచ్చే అంశాలను కూడా ఆయన మోదీ ముందుంచారు. దీంతో గుల్లలమోదలోనే క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు మోదీ అంగీకరించారు. తాజాగా అమరావతి పనుల పునర్నిర్మాణంతో పాటుగా కొత్తగా గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
This post was last modified on May 2, 2025 2:12 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…