Political News

అమరావతికి రక్షణ కవచంలా ‘గుల్లలమోద’

శత్రు దుర్బేధ్యంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో భారత్ తన సాధనా సంపత్తిని పెంచుకుంటోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్షిపణి పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచుకుంటోంది. అందులో భాగంగా ఏపీలో ఓ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం అటు జాతీయ భద్రతతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా రక్షణ కవచంగా మారనుందని చెప్పక తప్పదు. అమరావతికి కూతవేటు దూరంలో ఏర్పాటు కానున్న ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు శుక్రవారం వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి నుంచే వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

అమరావతికి అతి సమీపంలో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోద గ్రామంలో ఈ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక దశలో రూ.1,500 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ప్రధాని ఈ రూ.1,500 కోట్లతో చేపట్టే క్షిపణి పరీక్షా కేంద్రానికే వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. తదుపరి ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం మరింతగా తీర్చి దిద్దనుంది. ఇందుకోసం ఈ పరీక్షా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనుంది. అంటే… భవిష్యత్తులో భారత్ పరీక్షించనున్న దాదాపుగా అన్ని క్షిపణుల పరీక్షలన్నీ కూడా గుల్లలమోద కేంద్రం నుంచే జరగనున్నాయని చెప్పొచ్చు.

అంతరిక్ష ప్రయోగాలకు గానీ, క్షిపణి ప్రయోగాలకు గానీ… ఏపీలోని తీర ప్రాంతం అత్యంత అనుకూలమే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు అయ్యేలా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. కొత్తగా ఓ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోగానే.. ఆ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు… విషయాన్ని నేరుగా ప్రధాని వద్ద ప్రస్తావించారు. క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు గుల్లలమోద అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించడమే కాకుండా… సదరు క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుతో ఏపీకి కలిసివచ్చే అంశాలను కూడా ఆయన మోదీ ముందుంచారు. దీంతో గుల్లలమోదలోనే క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు మోదీ అంగీకరించారు. తాజాగా అమరావతి పనుల పునర్నిర్మాణంతో పాటుగా కొత్తగా గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

This post was last modified on May 2, 2025 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago