Political News

ఇది చాలా సున్నితమైన అంశం

కులాల వారీగా దేశంలో జనాభాను గణించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఏళ్ల తరబడి పలు వర్గాల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా… ఆ దిశగా ఇప్పటిదాకా అడుగు ముందుకు పడలేదు. అయితే తాజాగా బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కుల గణన దిశగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది చేపట్టనున్న జన గణన సమయంలోనే కుల గణనను కూడా చేపట్టాలని కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

కుల గణన రాజకీయంగా చాలా సున్నితమైన అంశమన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రిజర్వేషన్లను అందుకుంటున్న ఆయా సామాజిక వర్గాలు తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ప్రధానంగా బీసీ వర్గాల నుంచే వినిపిస్తోంది. దేశ జనాభాలో సగానికి పైగా తామే ఉన్నామని చెబుతున్న బీసీలు ఆ మేరకు తమకు తగినంత మేర రిజర్వేషన్లు మాత్రం దక్కడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కుల గణన చేపట్టి… అందులో వచ్చిన ఫలితాల ఆధారగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించాలని ఆ వర్గాలు డిమాడ్ చేస్తున్నాయి. 

ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కుల గణనను చేపట్టింది. ఈ కుల గణన ఆధారగా రిజర్వేషన్లను మారుస్తున్నట్లు కూడా రేవంత్ సర్కారు ప్రకటించింది. ఆ మేరకు తాను తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రానికి కూడా పంపింది. తాము తీసుకున్న నిర్ణయానికి అనుమతి ఇవ్వాలని కూడా కేంద్రాన్ని తెలంగాణ కోరింది. అంతేకాకుడా కేంద్రం కూడా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కూడా మోదీ సర్కారును తెలంగాణ కోరింది. తెలంగాణ లోని తమ పార్టీ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.

తాము అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సర్కారులో దీనిపై గత కొంతకాలంగా ఒకింత లోతుగానే చర్చ సాగింది. ఎట్టకేలకు కుల గణనకు అనుకూలంగా ఎన్డీఏ నిర్ణయం తీసుకోగా… ఆ నిర్ణయానికి బుధవారం నాటి కేంద్ర కేబినెట్ భేటీ ఆమోద ముద్ర వేసినట్టు అయ్యింది. కేంద్రం ప్రకటించినట్లుగా కుల గణన జరిగిన తర్వాత ఆయా వర్గాలకు అందుతున్న రిజర్వేషన్ల శాతాల్లోనూ మార్పులు చోటుచేసుకోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

This post was last modified on May 1, 2025 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

7 minutes ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

32 minutes ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

58 minutes ago

ఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయం

తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…

2 hours ago

దొంగకే దెబ్బ… ChatGPTతో చుక్కలు చూపించిన కుర్రాడు

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…

2 hours ago

సాయిపల్లవి నిర్ణయాలు అందుకే ఆలస్యం

గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…

2 hours ago