తాజాగా జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో.. ఏపీ వాసులు సహా 26 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఒకవైపు కేంద్రం తీవ్రంగా చర్యలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దాయాది దేశం పాకిస్థాన్పై ఆంక్షలు విధించేందుకు కూడా రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో అంతర్గతంగా బీజేపీ నాయకులు.. ఈ దాడిని ఖండిస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు కూడా నిర్వహించారు.
అయితే.. వీరికి మించిన రీతిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజృంభించారు. నేరుగా ఆయన పేరు పెట్టి అనకపోయినా.. పాకిస్థాన్ను సమర్థించేవారిని దేశం వదిలి వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు కరుడుగట్టిన బీజేపీ నాయకులు కూడా చేయకపోవడం గమనార్హం. అంతేకాదు.. పాకిస్థాన్ విషయంలో పవన్ చాలా సూటిగా సుత్తి లేకుండా స్పందించారు.
మృతుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే ఉగ్రదాడుల ఘటనలపై పవన్ చేసిన వ్యాఖ్యలు.. జాతీయస్థాయిలో ప్రచారం, ప్రసారం కూడా అయ్యాయి. దీంతో జాతీయస్థాయిలో పవన్ ఇమేజ్ మరింత పెరిగింది. వివిధ భాషలకు చెందిన బీజేపీ అనుకూల చానెళ్లు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన చానెళ్లు కూడా.. పవన్ వ్యాఖ్యలను షేర్ చేయడం , బీజేపీ సోషల్ మీడియాలోనూ పవన్ వ్యాఖ్యలు.. మరింత మంది ఎక్కువగా షేర్ చేయడంతో ఇప్పుడు పవన్ పేరు జోరుగా వినిపిస్తోంది.
ఈ క్రమంలో కేంద్రంలోని పెద్దలు కూడా.. పవన్ చేసిన వ్యాఖ్యలను హిందీలోకి తర్జుమా చేయించుకుని విన్నారని తెలిసింది. దీనికి ఆయనకు అభినందనలు కూడా తెలిపినట్టు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నా.. అనుకున్న విధంగా పాక్ విషయంలో స్పందన లేకుండా వ్యవహరించడంతో .. పవన్ ఈ పార్టీని ఓవర్ టేక్ చేసిన విధంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. గతంలో తిరుమల వ్యవహారం, తిరుపతి తొక్కిసలాటపైనా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
This post was last modified on May 1, 2025 11:23 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…