Political News

ఏపీ బీజేపీని ఓవ‌ర్ టేక్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ..!

తాజాగా జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడిలో.. ఏపీ వాసులు స‌హా 26 మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై ఒక‌వైపు కేంద్రం తీవ్రంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దాయాది దేశం పాకిస్థాన్‌పై ఆంక్ష‌లు విధించేందుకు కూడా రెడీ అవుతోంది. ఇలాంటి స‌మ‌యంలో అంత‌ర్గ‌తంగా బీజేపీ నాయ‌కులు.. ఈ దాడిని ఖండిస్తున్నారు. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు కూడా నిర్వ‌హించారు.

అయితే.. వీరికి మించిన రీతిలో బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ విజృంభించారు. నేరుగా ఆయ‌న పేరు పెట్టి అన‌క‌పోయినా.. పాకిస్థాన్‌ను స‌మ‌ర్థించేవారిని దేశం వ‌దిలి వెళ్లిపోవాల‌ని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్య‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రుడుగ‌ట్టిన బీజేపీ నాయ‌కులు కూడా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. పాకిస్థాన్ విష‌యంలో ప‌వ‌న్ చాలా సూటిగా సుత్తి లేకుండా స్పందించారు.

మృతుల ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేస్తూనే ఉగ్ర‌దాడుల ఘ‌ట‌న‌ల‌పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. జాతీయ‌స్థాయిలో ప్ర‌చారం, ప్ర‌సారం కూడా అయ్యాయి. దీంతో జాతీయ‌స్థాయిలో ప‌వ‌న్ ఇమేజ్ మ‌రింత పెరిగింది. వివిధ భాష‌ల‌కు చెందిన బీజేపీ అనుకూల చానెళ్లు, బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు చెందిన చానెళ్లు కూడా.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను షేర్ చేయ‌డం , బీజేపీ సోష‌ల్‌ మీడియాలోనూ ప‌వ‌న్ వ్యాఖ్య‌లు.. మ‌రింత మంది ఎక్కువ‌గా షేర్ చేయ‌డంతో ఇప్పుడు ప‌వ‌న్ పేరు జోరుగా వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో కేంద్రంలోని పెద్ద‌లు కూడా.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను హిందీలోకి త‌ర్జుమా చేయించుకుని విన్నార‌ని తెలిసింది. దీనికి ఆయ‌న‌కు అభినంద‌నలు కూడా తెలిపిన‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిపై అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. రాష్ట్రంలో బీజేపీ నాయ‌కులు క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నా.. అనుకున్న విధంగా పాక్ విష‌యంలో స్పంద‌న లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డంతో .. ప‌వ‌న్ ఈ పార్టీని ఓవ‌ర్ టేక్ చేసిన విధంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో తిరుమ‌ల వ్య‌వ‌హారం, తిరుప‌తి తొక్కిస‌లాట‌పైనా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

This post was last modified on May 1, 2025 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

16 seconds ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

14 minutes ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

4 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

5 hours ago