Political News

హోం మంత్రి అనితను మెచ్చుకున్న పవన్

సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోయిన ఘటన ఏపీలో పెను కలకలం రేపింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే…రాష్ట్ర హోం, విపత్తులశాఖ మంత్రి వంగలపూడి అనిత వేగంగా స్పందించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకే ఆమె ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ పరిస్థితులను సమీక్షించి.. బాధితులకు భరోసాగా నిలిచారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం, మృతుల కుటుంబాలను ఓదారుస్తూ ఆమె క్షణం తీరిక లేకుండా సాగారు. మీడియా అడిగిన రకరకాల ప్రశ్నలకు విసుగు లేకుండా సమాధానం చెప్పారు.

రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న అనిత.. పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ అధికారులను అలెర్ట్ చేసి… ఉదయం నిద్ర లేచాక తాను ఎప్పుడో 10గంటలకు వెళ్లినా అడిగే వారే లేరు కదా. అయితే ప్రమాదం జరిగిందన్న విషయం తెలియంగానే అనిత క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి బయలుదేరారు. అనిత శ్రమ ఊరికే పోలేదు. సాయంత్రానికంతా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అనిత గొప్పతనాన్ని కీర్తిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా అనిత పనితీరు తమ కూటమి ప్రభుత్వ భరోసాకు నిదర్శనంగా నిలిచిందని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపత్కర పరిస్థితుల్లో అనిత బాద్యతల నిర్వహణ అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

విపత్కర పరిస్థితుల సమయంలో అనిత చూపుతున్న చొరవ, బాధితులకు ఆమె బాసటగా నిలుస్తున్న తీరు కూడా అభినందనీయమని కూడా పవన్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ఏ సమయంలో అయినా స్పందించడమే కాకుండా శోకంలో ఉన్న వారికి సాంత్వన కూడా చేకూర్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనిత ఆ దిశగానే సాగుతున్నారని ఆయన కొనియాడారు. సింహాచలం ప్రమాదం గురించి తెలియగానే… తెల్లవారుజామున 3 గంటలకు ఆమె ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని ఆయన గుర్తు చేశారు. పహల్ గాం ఘటనలో చంద్రమౌళి కుటుంబానికీ అనిత అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. తమ కూటమి ప్రభుత్వం బాధితులకు ఎలా భరోసా ఇస్తుందో చెప్పడానికి అనిత బాధ్యతల నిర్వహణ ఒక తార్కాణం అని పవన్ ఆమెను ఆకాశానికెత్తేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అనిత.. తన ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. చంద్రబాబు చుట్టూ ఉండే అతి కొద్దిమంది నేతల్లో అనిత కూడా ఒకరిగా మారిపోయారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ తోనూ సన్నిహితంగా సాగే అనిత… ప్రస్తుతం టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పార్టీ విపక్షంలో ఉండగా.. పార్టీ అధిష్ఠానంపై ఈగ వాలకుండా రక్షణ గోడగా నిలిచిన వారిలో అనిత ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. ఈ కారణంగానే టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే.. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు… అనితకు ఏకంగా హోం మినిస్టర్ గా అవకాశం కల్పించారు. పనితీరులో నిబద్ధత కలిగిన నేతగా అనిత పేరు తెచ్చుకున్నారు.

This post was last modified on April 30, 2025 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago