అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వానికి పంటి కింద రాళ్ల మాదిరిగా విపత్తులు-వివాదాలు ముసురుకుంటున్నాయి. పది మాసాల పాలనలో ఎదురైన అనుభవాలను చూస్తే.. ఆయా విపత్తులు.. సర్కారుకు పెను సవాలుగానే పరిణమించాయని చెప్పక తప్పదు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రబుత్వం ఏర్పడిన కొత్తలో గత ఏడాది సెప్టెంబరులో విజయవాడను బుడమేరు ముంచేసింది. దీంతో వేలాది కుటుంబాలు నీట చిక్కుకున్నాయి.
దీంతో స్వయంగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. రోజుల తరబడి విజయవాడలోనే మకాం వేసి.. బాధితులను స్వయంగా వరద నీటిలోనే వెళ్లి పరామర్శించి.. వారికి సాయం చేశారు. రాత్రికి రాత్రి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ కష్టం నుంచి బయటకు వచ్చే సరికి.. ఏలూరులోని ఎర్రకాలువ పొంగింది. దీంతో అక్కడ వేలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. దీంతో ఇబ్బందులు తప్పలేదు. ఇక, ఆ తర్వాత.. విశాఖ, కాకినాడల్లోని ఫార్మా కంపెనీల్లో.. తలెత్తిన ఘటనల్లో పలువురు చనిపోయారు.
ఇక, ఈ ఏడాది మొదట్లో.. తిరుమల వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు టికెట్ తీసుకునే క్రమంలో తలెత్తిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇది తీవ్ర వివాదం రేపింది. దీనికి ముందు లడ్డూ ప్రసాదం కల్తీ కూడా.. సర్కారును ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది. ఇటీవల తూర్పుగోదావరిలో బాణా సంచా పేలుడు కారణంగా.. సుమారు 8 మంది వరకు మృతి చెందారు. ఇలా.. ఒక్కొక్క ఘటన సర్కారును ఇరుకున పెట్టాయి.
తాజాగా సిహాచలంలో రూ.300 టికెట్ల దర్శన కౌంటర్ వద్ద గోడ కూలిన ఘటన లో 8 మంది చనిపోయారు. మరింత మంది గాయపడ్డారు. వీరికి కూడా ఇప్పుడు రూ.25 లక్షల మేరకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పైగా.. ఇది రాజకీయ వివాదాలకు కూడా దారితీసింది. వైసీపీ హయాంలో నిర్మించిన గోడ కారణంగానే ఇది జరిగిందని మంత్రి అనిత వంటి వారువ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. కూటమి సర్కారుకు విపత్తులు- వివాదాలు ఇబ్బందికరంగా మారాయనే చెప్పాలి.
This post was last modified on April 30, 2025 9:49 pm
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…