Political News

పాపం కూట‌మి.. వివాదాలు – విప‌త్తులు.. !

అభివృద్ధి-సంక్షేమం రెండు క‌ళ్లుగా దూసుకుపోతున్న కూట‌మి ప్ర‌భుత్వానికి పంటి కింద రాళ్ల మాదిరిగా విప‌త్తులు-వివాదాలు ముసురుకుంటున్నాయి. ప‌ది మాసాల పాల‌న‌లో ఎదురైన అనుభ‌వాల‌ను చూస్తే.. ఆయా విప‌త్తులు.. స‌ర్కారుకు పెను సవాలుగానే ప‌రిణ‌మించాయ‌ని చెప్ప‌క‌ త‌ప్ప‌దు. అయిన‌ప్ప‌టికీ కూట‌మి ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్ర‌బుత్వం ఏర్ప‌డిన కొత్త‌లో గ‌త ఏడాది సెప్టెంబ‌రులో విజ‌య‌వాడ‌ను బుడ‌మేరు ముంచేసింది. దీంతో వేలాది కుటుంబాలు నీట చిక్కుకున్నాయి.

దీంతో స్వ‌యంగా రంగంలోకి దిగిన సీఎం చంద్ర‌బాబు.. రోజుల త‌ర‌బ‌డి విజ‌య‌వాడ‌లోనే మ‌కాం వేసి.. బాధితుల‌ను స్వ‌యంగా వ‌ర‌ద నీటిలోనే వెళ్లి పరామ‌ర్శించి.. వారికి సాయం చేశారు. రాత్రికి రాత్రి వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ క‌ష్టం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి.. ఏలూరులోని ఎర్ర‌కాలువ పొంగింది. దీంతో అక్కడ వేలాది ఎక‌రాల్లో పొలాలు నీట మునిగాయి. దీంతో ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. విశాఖ‌, కాకినాడ‌ల్లోని ఫార్మా కంపెనీల్లో.. త‌లెత్తిన ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు చ‌నిపోయారు.

ఇక‌, ఈ ఏడాది మొద‌ట్లో.. తిరుమ‌ల వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు టికెట్ తీసుకునే క్ర‌మంలో త‌లెత్తిన తొక్కిస‌లాట‌లో ప‌లువురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇది తీవ్ర వివాదం రేపింది. దీనికి ముందు ల‌డ్డూ ప్ర‌సాదం కల్తీ కూడా.. స‌ర్కారును ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది. ఇటీవ‌ల తూర్పుగోదావ‌రిలో బాణా సంచా పేలుడు కార‌ణంగా.. సుమారు 8 మంది వ‌ర‌కు మృతి చెందారు. ఇలా.. ఒక్కొక్క ఘ‌ట‌న స‌ర్కారును ఇరుకున పెట్టాయి.

తాజాగా సిహాచలంలో రూ.300 టికెట్ల ద‌ర్శ‌న కౌంట‌ర్ వ‌ద్ద గోడ కూలిన ఘ‌ట‌న లో 8 మంది చ‌నిపోయారు. మ‌రింత మంది గాయ‌ప‌డ్డారు. వీరికి కూడా ఇప్పుడు రూ.25 ల‌క్ష‌ల మేర‌కు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. పైగా.. ఇది రాజ‌కీయ వివాదాల‌కు కూడా దారితీసింది. వైసీపీ హ‌యాంలో నిర్మించిన గోడ కార‌ణంగానే ఇది జ‌రిగింద‌ని మంత్రి అనిత వంటి వారువ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. కూట‌మి స‌ర్కారుకు విప‌త్తులు- వివాదాలు ఇబ్బందిక‌రంగా మారాయ‌నే చెప్పాలి.

This post was last modified on April 30, 2025 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago