Political News

పాపం కూట‌మి.. వివాదాలు – విప‌త్తులు.. !

అభివృద్ధి-సంక్షేమం రెండు క‌ళ్లుగా దూసుకుపోతున్న కూట‌మి ప్ర‌భుత్వానికి పంటి కింద రాళ్ల మాదిరిగా విప‌త్తులు-వివాదాలు ముసురుకుంటున్నాయి. ప‌ది మాసాల పాల‌న‌లో ఎదురైన అనుభ‌వాల‌ను చూస్తే.. ఆయా విప‌త్తులు.. స‌ర్కారుకు పెను సవాలుగానే ప‌రిణ‌మించాయ‌ని చెప్ప‌క‌ త‌ప్ప‌దు. అయిన‌ప్ప‌టికీ కూట‌మి ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్ర‌బుత్వం ఏర్ప‌డిన కొత్త‌లో గ‌త ఏడాది సెప్టెంబ‌రులో విజ‌య‌వాడ‌ను బుడ‌మేరు ముంచేసింది. దీంతో వేలాది కుటుంబాలు నీట చిక్కుకున్నాయి.

దీంతో స్వ‌యంగా రంగంలోకి దిగిన సీఎం చంద్ర‌బాబు.. రోజుల త‌ర‌బ‌డి విజ‌య‌వాడ‌లోనే మ‌కాం వేసి.. బాధితుల‌ను స్వ‌యంగా వ‌ర‌ద నీటిలోనే వెళ్లి పరామ‌ర్శించి.. వారికి సాయం చేశారు. రాత్రికి రాత్రి వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ క‌ష్టం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి.. ఏలూరులోని ఎర్ర‌కాలువ పొంగింది. దీంతో అక్కడ వేలాది ఎక‌రాల్లో పొలాలు నీట మునిగాయి. దీంతో ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. విశాఖ‌, కాకినాడ‌ల్లోని ఫార్మా కంపెనీల్లో.. త‌లెత్తిన ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు చ‌నిపోయారు.

ఇక‌, ఈ ఏడాది మొద‌ట్లో.. తిరుమ‌ల వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు టికెట్ తీసుకునే క్ర‌మంలో త‌లెత్తిన తొక్కిస‌లాట‌లో ప‌లువురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇది తీవ్ర వివాదం రేపింది. దీనికి ముందు ల‌డ్డూ ప్ర‌సాదం కల్తీ కూడా.. స‌ర్కారును ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది. ఇటీవ‌ల తూర్పుగోదావ‌రిలో బాణా సంచా పేలుడు కార‌ణంగా.. సుమారు 8 మంది వ‌ర‌కు మృతి చెందారు. ఇలా.. ఒక్కొక్క ఘ‌ట‌న స‌ర్కారును ఇరుకున పెట్టాయి.

తాజాగా సిహాచలంలో రూ.300 టికెట్ల ద‌ర్శ‌న కౌంట‌ర్ వ‌ద్ద గోడ కూలిన ఘ‌ట‌న లో 8 మంది చ‌నిపోయారు. మ‌రింత మంది గాయ‌ప‌డ్డారు. వీరికి కూడా ఇప్పుడు రూ.25 ల‌క్ష‌ల మేర‌కు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. పైగా.. ఇది రాజ‌కీయ వివాదాల‌కు కూడా దారితీసింది. వైసీపీ హ‌యాంలో నిర్మించిన గోడ కార‌ణంగానే ఇది జ‌రిగింద‌ని మంత్రి అనిత వంటి వారువ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. కూట‌మి స‌ర్కారుకు విప‌త్తులు- వివాదాలు ఇబ్బందిక‌రంగా మారాయ‌నే చెప్పాలి.

Satya

Recent Posts

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

43 seconds ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

17 minutes ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

21 minutes ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

43 minutes ago

దేశ‌వ్యాప్తంగా… బొద్దింక‌ల జోరు!

కాక్రోచ్ జ‌నతా పార్టీ(సీజేపీ)గా ఏర్ప‌డి ఉద్య‌మాలు చేస్తున్న ఈ పార్టీ.. దేశవ్యాప్తంగా విస్త‌రించే ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తోంది. కొన్ని రోజుల…

1 hour ago

భూములిచ్చిన గౌరవం… విమానంలో రైతులు, రైతు కూలీలు

అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గౌరవం కల్పించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం…

2 hours ago