విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ దేవాలయం సింహాచలంలో బుధవారం తెల్లవారు జామున ఓ గోడ కూలి భక్తులపై పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తం గానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. దీనిపై ప్రధాని నుంచి రాష్ట్రపతి వరకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తూనే.. అధికారులపై నిప్పులు చెరిగారు.
తాజాగా విశాఖపట్నం ఉన్నతాధికారులతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ ఆయన వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యం ఉంది? ముందుగా చేసిన ఏర్పాట్లు ఏంటి? గత ఏడాది కంటే.. ఈ సారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినా.. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ.. నిప్పులు కక్కారు. ఈ క్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లకు సంబంధించి ఎన్ని సార్లు సమీక్షించారని ఆయనను ప్రశ్నించారు.
అయితే.. తాను ఒకే ఒక్కసారి సమీక్షించానని.. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తాను సింహాచలంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయానని వివరించారు. దీనిపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేసమయంలో జిల్లాకు చెందిన హోం మంత్రి అనితపైనా అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసే ముందు మీరు పర్యవేక్షించారా? అని ఆమెను కూడా నిలదీశారు. మొత్తంగా వీడియో కాన్ఫరెన్స్ హాట్హాట్గా జరిగింది.
అనంతరం.. విశాఖపట్నం కలెక్టర్గా హరేంధిర ప్రసాద్ ను బదిలీ చేయాలని.. తర్వాత పరిణామాలను బట్టి.. వేరే పోస్టు ఇవ్వాలని సీఎస్ను ఆదేశించారు. అదేవిధంగా సింహాచలం ఘటనపై తనకు 72 గంటల్లోగా నివేదికను అందించాలని కూడా.. సీఎం చంద్రబాబు అధికారులకు డెడ్లైన్ విధించారు. మంత్రులు కూడా.. విడిగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కూలిపోయిన గోడను కట్టించిన కాంట్రాక్టర్పైనా కేసులు పెట్టాలన్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…