Political News

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఘోరం… భ‌క్తులు మృతి

ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు .. విశాఖప‌ట్నం జిల్లాలోని వ‌రాహ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌య‌మైన‌ సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం నేడు. ఏడాదికి ఒక్క‌సారి జ‌రిగే ఈ చంద‌నోత్స‌వం నాడు మాత్ర‌మే స్వామి వారి నిజ‌రూప ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఈ ఒక్క‌రోజు కోసం.. 364 రోజులు వేచి చూసే భ‌క్తులు స్వామి ఆల‌యానికి పోటెత్తుతారు. అలానే.. ఈ రోజు(బుధ‌వారం) కూడా భ‌క్తులు భారీ సంఖ్య‌లో ఆల‌యానికి చేరుకున్నారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయ‌ల‌ టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది.

దీంతో భ‌క్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ క్ర‌మంలో ఊపిరాడ‌క‌.. 8 మంది భ‌క్తులు మృతి చెందా రు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీసు ఉన్న‌తాధికారి శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.

మీదే త‌ప్పు.. కాదు మీదే!

తాజాగా జ‌రిగిన గోడ కూలిన ఘ‌ట‌న‌పై అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోని కార‌ణంగానే.. గోడ కూలి భ‌క్తులు మృతి చెందార‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శించారు. అయితే.. అస‌లు ఆ గో డ‌లో నాణ్య‌త లేని కార‌ణంగానే.. అది కూలిపోయింద‌ని వైసీపీ నాయ‌కుల‌కు హోం మంత్రి అనిత కౌంట‌ర్ ఇచ్చారు. ఆ గోడ ఎప్పుడు క‌ట్టారో.. నాణ్య‌త ఏమిటో తెలుసుకునేందుకు క‌మిటీ వేసి విచార‌ణ చేస్తామ‌ని.. బాధ్యుల‌ను శిక్షిస్తామ‌ని మంత్రి హెచ్చ‌రించారు.

Satya

Recent Posts

టార్గెట్ కాంగ్రెస్‌… పవన్ కీల‌క వ్యూహం?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజ‌కీయంగా త‌న‌కు ఉన్న ల‌క్ష్యాన్ని కూడా వివ‌రించారు. దేశాన్ని…

38 minutes ago

నేనూ కాక్రోచ్ అవుతానంటున్న జగన్

ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…

39 minutes ago

మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై జగన్‌కు అన్ని డౌట్లు!

మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…

2 hours ago

సోగ్గాడి స్థానంలో కింగ్ వస్తున్నాడా ?

కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…

2 hours ago

ఓజి… పెద్ది… విశ్వంభర ఏదీ

గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…

3 hours ago

బాలకృష్ణ లైనప్ స్పష్టంగా ఉంది

సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…

3 hours ago