Political News

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఘోరం… భ‌క్తులు మృతి

ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు .. విశాఖప‌ట్నం జిల్లాలోని వ‌రాహ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌య‌మైన‌ సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం నేడు. ఏడాదికి ఒక్క‌సారి జ‌రిగే ఈ చంద‌నోత్స‌వం నాడు మాత్ర‌మే స్వామి వారి నిజ‌రూప ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఈ ఒక్క‌రోజు కోసం.. 364 రోజులు వేచి చూసే భ‌క్తులు స్వామి ఆల‌యానికి పోటెత్తుతారు. అలానే.. ఈ రోజు(బుధ‌వారం) కూడా భ‌క్తులు భారీ సంఖ్య‌లో ఆల‌యానికి చేరుకున్నారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయ‌ల‌ టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది.

దీంతో భ‌క్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ క్ర‌మంలో ఊపిరాడ‌క‌.. 8 మంది భ‌క్తులు మృతి చెందా రు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీసు ఉన్న‌తాధికారి శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.

మీదే త‌ప్పు.. కాదు మీదే!

తాజాగా జ‌రిగిన గోడ కూలిన ఘ‌ట‌న‌పై అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోని కార‌ణంగానే.. గోడ కూలి భ‌క్తులు మృతి చెందార‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శించారు. అయితే.. అస‌లు ఆ గో డ‌లో నాణ్య‌త లేని కార‌ణంగానే.. అది కూలిపోయింద‌ని వైసీపీ నాయ‌కుల‌కు హోం మంత్రి అనిత కౌంట‌ర్ ఇచ్చారు. ఆ గోడ ఎప్పుడు క‌ట్టారో.. నాణ్య‌త ఏమిటో తెలుసుకునేందుకు క‌మిటీ వేసి విచార‌ణ చేస్తామ‌ని.. బాధ్యుల‌ను శిక్షిస్తామ‌ని మంత్రి హెచ్చ‌రించారు.

This post was last modified on April 30, 2025 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

4 minutes ago

బాలయ్య మూవీ అంటే కొరటాలకు సవాలే

దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…

34 minutes ago

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

5 hours ago

సిద్దు తీసుకుంది సరైన నిర్ణయమే

ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…

7 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

9 hours ago