కోడి రామకృష్ణ, బి గోపాల్ తర్వాత బాలకృష్ణకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడిగా బోయపాటి శీను అంటే అభిమానుల్లో ప్రత్యేకమైన గౌరవముంది. అందుకే ఈ కాంబోలో తెరకెక్కే సినిమా ఏదైనా నిర్మాణంలో ఉన్నప్పుడే రెట్టింపు క్రేజ్ తెచ్చేసుకుంటుంది. అఖండ 2 తాండవం మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతలు తొందరపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇప్పటిదాకా నలభై శాతానికి పైగానే పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేసుకున్నారు. బాలయ్య అందులో పాల్గొనబోతున్నారు.
ఇందులో అనుకోని సర్ప్రైజ్ అతిథులు ఉంటారని లేటెస్ట్ లీక్. బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఒక పవర్ ఫుల్ క్యామియో చేస్తారని ఇన్ సైడ్ టాక్. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆయన ఎంట్రీ జార్జియాలోనే ఉంటుందని వినికిడి. అఘోరాగా కనిపించే బాలయ్యతో ఆయన కలయికలో ఎలాంటి ఎపిసోడ్ ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. గదర్ 2, జాట్ తో మంచి ఊపు మీదున్న సన్నీ డియోల్ కనక నిజంగా అఖండ 2లో భాగమైతే హిందీ మార్కెట్ పరంగా ఉపయోగపడుతుంది. తమ్ముడు బాబీ డియోల్ ఆ మధ్య డాకు మహారాజ్ లో చేశాడు, ఇప్పుడు అన్నయ్య సన్నీడియోల్ అఖండ 2లో వస్తే స్పెషలవుతుంది.
అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ గాసిప్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. సంయుక్త మీనన్, ఆదిపినిశెట్టి తదితరుల క్యాస్టింగ్ తో అఖండ 2 మొదటి భాగానికి నాలుగింతలు ఎక్కువగా ఉంటుందని వర్క్ చేసిన వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట. అఖండలో ఫస్ట్ హాఫ్ మొత్తం రెండో బాలయ్య మీద వెళ్లిందని, అఘోరా ఎంట్రీ ఇంటర్వెల్ లో చూశామని, కానీ అఖండ 2లో మొదటి నుంచి చివరి దాకా అఘోరా బాలయ్య విశ్వరూపమే కనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఈసారి స్పీకర్లు మరోసారి బద్దలు కావడం ఖాయమే. ముందు ప్రకటించిన సెప్టెంబర్ 25 విడుదల తేదీ మారొచ్చని టాక్.
This post was last modified on April 30, 2025 5:36 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…