ఏపీ రాజధాని అమరావతి పరుగులు పెడుతోంది. ఈ నెల 13 నుంచి పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వానికి చేరాయి. దీనికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం కేటాయించింది. ఫలితంగా ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా తోడయ్యారు. దీంతో సుమారు 65 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ తాజాగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి వీడియోను రాష్ట్ర ప్రజలతో పంచుకున్నారు. మొత్తం నవనగరాలు, నివాసాలు, హైకోర్టు, సచివాలయం.. సహా ఏయే భవనాలు వస్తున్నాయో.. ఈ వీడియోలో వివరించారు. అదేవిధంగా కృష్ణానదిపై నిర్మించనున్న అమరావతి-హైదరాబాద్ రహదారి అనుసంధానం ప్రాజెక్టును కూడా పేర్కొన్నారు. అలానే.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా.. వీడియోలో సమగ్రంగా చూపించారు.
రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమై.. వడివడిగా సాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేలా నారా లోకేష్ ఈ వీడియోను పంచుకోవడం గమనార్హం. అంతేకాదు.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నదీ ఈ వీడియోలో వివరించారు. మొత్తంగా రాజధాని సమగ్ర రూపాన్ని స్వల్ప వ్యవధిలోనే రూపించడం గమనార్హం. కాగా.. రాజధాని పనులను సోమవారం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అదేవిధంగా వచ్చే నెల 2న ప్రధాని మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా.. సీఎం పర్యవేక్షించనున్నారు.
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…