ఏపీ రాజధాని అమరావతి పరుగులు పెడుతోంది. ఈ నెల 13 నుంచి పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వానికి చేరాయి. దీనికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం కేటాయించింది. ఫలితంగా ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా తోడయ్యారు. దీంతో సుమారు 65 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ తాజాగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి వీడియోను రాష్ట్ర ప్రజలతో పంచుకున్నారు. మొత్తం నవనగరాలు, నివాసాలు, హైకోర్టు, సచివాలయం.. సహా ఏయే భవనాలు వస్తున్నాయో.. ఈ వీడియోలో వివరించారు. అదేవిధంగా కృష్ణానదిపై నిర్మించనున్న అమరావతి-హైదరాబాద్ రహదారి అనుసంధానం ప్రాజెక్టును కూడా పేర్కొన్నారు. అలానే.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా.. వీడియోలో సమగ్రంగా చూపించారు.
రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమై.. వడివడిగా సాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేలా నారా లోకేష్ ఈ వీడియోను పంచుకోవడం గమనార్హం. అంతేకాదు.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నదీ ఈ వీడియోలో వివరించారు. మొత్తంగా రాజధాని సమగ్ర రూపాన్ని స్వల్ప వ్యవధిలోనే రూపించడం గమనార్హం. కాగా.. రాజధాని పనులను సోమవారం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అదేవిధంగా వచ్చే నెల 2న ప్రధాని మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా.. సీఎం పర్యవేక్షించనున్నారు.
This post was last modified on April 28, 2025 5:37 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…