వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సొంత మీడియా వ్యవహారాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బ్రాడ్ కాస్టింగ్ పనులపై ఆయన బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్-బెంగళూరు-ఢిల్లీ అంటూ.. వారం వారం ఆయన చక్కర్లు కొడుతున్నారు. గతంలో ఓ కీలక ఛానెల్లో సీఈవోగా చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుగుతున్నాయని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ ఏడాది దసరా నాటికి ‘వి-టీవీ’ పేరుతో సంస్థను స్థాపించే అవకాశం ఉందని కూడా మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఫండింగ్ వ్యవహారాలు.. ఉత్తరాదికి చెందిన ఓ వ్యాపార వేత్త చూస్తున్నారని.. ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. గత ఏడాది తను సొంతగా మీడియా పెడతానంటూ.. సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు.
కానీ, తర్వాత.. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకొని.. వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో సొంత చానెల్ వ్యవహారం కూడా ఆగిపోయిందని అనుకున్నారు. అదే సమయంలో రాజకీయాల నుంచి కూడా సాయిరెడ్డి విరమించుకున్నారన్న చర్చ జరిగింది. కానీ.. సాయిరెడ్డిని జాతీయ పార్టీ ఒకటి ఆహ్వానిస్తున్నట్టు వార్తలు రావడంతోపాటు.. తనకంటూ.. ప్రత్యేక వేదిక ఉండాలని కూడా సాయిరెడ్డి భావిస్తున్నారు. సో.. ఇండిపెండెంట్గా అయినా.. ఆయన రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నారు.
దీంతో సొంత ఛానెల్ వ్యవహారాన్ని ఆయన నిలుపుదల చేయలేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-చానెల్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని సమాచారం. అయితే.. దీనిపై పెద్దగా ప్రచారం జరగకుండా సాయిరెడ్డి జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇటీవల ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడినప్పుడు సొంత మీడియా గురించి.. అడగ్గా.. త్వరలోనే అప్డేట్ ఉంటుందని వ్యాఖ్యానించి.. జారుకున్నారు. అంతకుమించి ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సో.. దీనిని బట్టి తెరవెనుక ఏర్పాట్లు ముమ్మరంగానే సాగుతున్నాయని తెలుస్తోంది.
This post was last modified on April 27, 2025 12:29 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…