అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్గా ఉన్నవారే.. నేడు అసలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం.. వైసీపీ గురించి మాట్లాడు కునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు.. ఏ ఇద్దరు కనిపించినా.. వైసీపీ గురించి.. జగన్ గురిం చిన చర్చ చేసేవారు. అదేసమయంలో నాయకుల దూకుడు.. మంత్రులు బూతుల గురించి కూడా.. చర్చ లు జరిగాయి.
అయితే.. ఒక్కసారి అధికారిపోయిన తర్వాత.. వైసీపీ పాత్ర గురించి ఎక్కడా చర్చకు రావడం లేదు. ఎవ రూ పట్టించుకోవడమూ లేదు. ఈ విషయాన్ని స్వయంగా జగనే చెప్పడం గమనార్హం. తాజాగా ఆయన రాయల సీమ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. గమనిస్తే.. వైసీపీ పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదన్న భావన వ్యక్తమవుతోంది. ఏందబ్బా.. మన గురించి ఎక్కడా వినిపించడం లేదు. మీరు ఏం చేస్తున్నారు అని ఒకప్పుడు యాక్టివ్గా ఉన్నవారిని జగన్ ప్రశ్నించారు.
అంతేకాదు.. తాను స్వయంగా వస్తే తప్ప.. ఎవరూ పుంజుకోరా? అని కూడా జగన్ ప్రశ్నించడం గమనార్హం. దీనిని బట్టి.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు కావాలి జగన్.. రావాలి జగన్.. అని పాడిన నాయకులు.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. వీరి పేర్లుపెట్టి మరీ జగన్ గుర్తు చేయాల్సి వచ్చింది. అంటే.. పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఇక, రాజకీయాల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే.. వైసీపీలో ఇంత నైరాశ్యానికి కారణం.. చాలా నే ఉందని అంటున్నారు.
ప్రజల్లో ఉన్నవారిని పట్టించుకోకపోవడం.. ఎప్పటి నుంచో ఉన్న కారణమైతే.. ఇప్పుడు పనిచేసినా.. గుర్తిం పు ఉంటుందో ఉండదన్న భావన నాయకుల్లో ఉంటోంది. సడెన్గా నియోజకవర్గాలను మార్చేసి.. కొత్తవారి కి అవకాశం ఇవ్వడం.. బలమైన బ్యాక్ డ్రాప్గా చెబుతున్నారు. నిర్దేశిత నాయకులను కూడా.. తక్కువ చేసి చూడడం ఇబ్బంది కలిగిస్తున్న పరిణామం. దీంతో వైసీపీలో నాయకులు బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ముందుగా ఈ వాదనను జగన్ ఖండించి.. నాయకుల్లో స్థయిర్యం నింపే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
This post was last modified on April 27, 2025 10:16 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…