‘ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఛాన్స్ ఇవ్వట్లేదు కానీ.. ఇస్తేనా?’ ఇదీ.. సీఎంవోలో వినిపిస్తున్న మాట. దీనికి కారణం.. కొందరు సలహాదారులు సచివాలయంలోనే తిష్ట వేస్తున్నారు. ఔనన్నా కాదన్నా.. గత వైసీపీ ప్రభుత్వం అంత కాకపోయినా.. ప్రస్తుత కూటమి సర్కారు కూడా.. సలహాదారులకు పెద్ద పీటే వేసింది. లెక్కకు మిక్కిలి కాకున్నా.. కొందరిని నియమించింది. ఇప్పటి వరకు ఉన్న లెక్క ప్రకారం.. 60-70 మంది వరకు సలహాదారులు ఉన్నారు.
అయితే.. ఎవరి పేరూ బయటకు రాదు..ఎవరూ బయటకు కనిపించరు. దీంతో సలహాదారుల గురించిన చర్చ పెద్దగా రావట్లేదు. అయితే.. వీరిలో చాలా మంది తమ తమ వ్యవహారాల్లో ఉంటే.. మరికొందరు మాత్రం సచివాలయంలో తిష్ట వేస్తున్నారు. మీడియా మిత్రులతో కలిసి తేనీరు సేవించి.. పిచ్చాపాటీ కబుర్లు కూడా చెబుతున్నారు. మరి వీరికి పనిలేదా? అంటే.. ఉందని వారే చెబుతున్నారు. కానీ.. తాము ఏం చెప్పినా.. పక్కన పెడుతున్నారన్నది వారి వాదన.
పర్యాటకం నుంచి పరిశ్రమల వరకు పలువురు సలహాదారులు ఉన్నారు. కానీ, పర్యాటక శాఖలో సలహా ఇస్తే.. మంత్రి కందుల దుర్గేష్.. సదరు సలహా కన్నా.. మరింత మెరుగ్గా ఆలోచన చేస్తున్నారు. దీంతో సలహా బుట్టదాఖలు అవుతోంది. పరిశ్రమల విషయంలోనూ ఇదే విధానం ఉంది. సో.. మొత్తంగా సలహాదారుల్లో చాలా మంది ఖాళీగానే ఉంటున్నారు. కానీ, వారు చెబుతున్న మాట… సీఎం చంద్రబాబు ఛాన్స్ ఇస్తే.. అని వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో వైసీపీ అధినేత జగన్ ఇలానే సలహాదారులను ముందు పెట్టి రాజకీయాలు చేశారు. ప్రభుత్వాన్ని కూడా నడిపించారు. అయితే.. అది బెడిసి కొట్టింది. పైగా.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగా.. సర్కారు అభాసుపాలైంది. సకల శాఖ మంత్రి అంటూ.. ఆయనపైనా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యాన్ని నిశితంగా గమనించిన చంద్రబాబు.. సలహాదారులకు ఛాన్స్ ఇవ్వడం లేదన్న చర్చ అయితే ఉంది. మరి వీరి సేవలను ఎలా వాడుకుంటారో చూడాలి.
This post was last modified on April 26, 2025 11:48 am
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…