Political News

ఉగ్రవాదం వేరు ముస్లిం సమాజం వేరు: పవన్

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. పర్యాటకులుగా కశ్మీర్ లోయలో అడుగుపెట్టిన ఆ 26 మందిని ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా తూటాలతో కాల్చి చంపారు. హిందువులను మాత్రమే ఎంచుకొని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ముస్లింలను వదిలేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య సున్నితమైన వాతావరణం ఏర్పడింది. టెర్రరిస్టులుగా మారిన అతివాద ముస్లింలు చేసిన దుశ్చర్య ప్రభావం మొత్తం ముస్లిం సమాజంపై పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ తరహా సున్నితమైన చర్చలు, విమర్శలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం వేరు…ఉగ్రవాదులు వేరు..మామూలు ముస్లిం సమాజం వేరు… అని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజంలో శాంతియుతంగా ఉండే, శాంతి భద్రతలు కోరుకునే ముస్లిం సమాజం వేరు అని పవన్ అన్నారు. అంతేకాదు, కొందరు ఉగ్రవాదుల చర్యల వల్ల మొత్తం ముస్లిం సమాజాన్ని నిందించడం సరైనది కాదని, ఆ స్పష్టత తమందరికి ఉందని, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని పవన్ స్పష్టం చేశారు.

అయితే, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందేనని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లల ముందు తండ్రిని చంపేశారని, శాడిస్టిక్ గా, ఒక పద్ధతి ప్రకారం అమాయకులను ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణ ఘటనను భారత దేశం ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరేయాలని, మనకు కనికరం ఎక్కువైపోయిందని, మంచితనం ఎక్కువైందని పవన్ అన్నారు.

This post was last modified on April 25, 2025 7:43 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

4 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

5 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago