Political News

మోదీతో బాబు భేటీ… అమరావతి 2.0 కి ఆహ్వానం!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ప్రధాని నివాసంలో మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ జరిగింది. 26 మందిని బలి తీసుకున్న ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు… ఉగ్రవాదులపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా సంపూర్ణంగా మద్దతు తెలపనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రానికి ఏపీ అండగా నిలుస్తుందని కూడా మోదీకి చంద్రబాబు తెలిపారు.

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పనుల పున:ప్రారంభానికి మోదీని ఆహ్వానించాలని ఇదివరకే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అమరావతిలో మోదీ టూర్ షెడ్యూల్ ఖరారు కాగా… ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి రాష్ట్రం తరఫున ఆహ్వానం అందించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇదివరకే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు కాగా… ఆలోగానే పెహల్ గాం ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో మోదీతో భేటీలో పెహల్ గాం దాడి, తదనంతర పరిణామాలపైనే చంద్రబాబు ప్రదానంగా చర్చించారు. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు..ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా మోదీని కోరారు. ఈ పోరాటంలో కేంద్రానికి ఏపీ ప్రజలు సంపూర్ణ మద్దతుగా నిలుస్తారని చంద్రబాబు తెలిపారు. 

గతంలో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోదీనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాజాగా 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు తీరిగి అధికారం చేపట్టడంతో రాజధాని నిర్మాణ పనులకు రంగం సిద్ధమైంది. రాజదానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాల కోసం శాశ్వత భవన నిర్మాణాల టెండర్లను ఇప్పటికే ఖరారు చేసిన చంద్రబాబు సర్కారు.. వాటిని ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. దాదాపుగా రూ.1 లక్ష కోట్ల విలువైన పనులను ప్రారభించేందుకు రంగం సిద్ధం కాగా… వాటిని మే నెల 2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చంద్రబాబు సర్కారు.. భారీ ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 25, 2025 8:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ గెలిచింది ‘ఇన్ స్టాగ్రామ్’ తోనా…?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…

4 minutes ago

అవసరమైతే కారుణ్య మరణం… కుక్కల దాడిపై సంచలన తీర్పు!

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…

19 minutes ago

నువ్వొస్తానంటే నేనొద్దంట‌నా.. ఐకానిక్ షాట్ వెనుక‌?

తెలుగులో వ‌చ్చిన బెస్ట్ ల‌వ్ స్టోరీస్‌లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా క‌చ్చితంగా ఉంటుంది. లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్‌లో ఉండ‌గా…

28 minutes ago

బాబుతో బాలినేని… వైసీపీ బాగా డిస్టర్బ్ అయినట్టే

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…

36 minutes ago

స్పిరిట్… ఈగో vs ఈగో

‘స్పిరిట్’లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే ఫైట్ కేవలం ఒక ఫైట్ కాదు. ఇది రెండు పవర్ సెంటర్ల…

1 hour ago

బుచ్చిబాబు లెక్కలు వేరే ఉన్నాయా

నిన్న విడుదలైన పెద్ది ట్రైలర్ కు అందరి నుంచి యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. అధిక శాతం ఫ్యాన్స్ అదిరిపోయిందనే అభిప్రాయం…

1 hour ago