టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ప్రధాని నివాసంలో మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ జరిగింది. 26 మందిని బలి తీసుకున్న ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు… ఉగ్రవాదులపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా సంపూర్ణంగా మద్దతు తెలపనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రానికి ఏపీ అండగా నిలుస్తుందని కూడా మోదీకి చంద్రబాబు తెలిపారు.
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పనుల పున:ప్రారంభానికి మోదీని ఆహ్వానించాలని ఇదివరకే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అమరావతిలో మోదీ టూర్ షెడ్యూల్ ఖరారు కాగా… ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి రాష్ట్రం తరఫున ఆహ్వానం అందించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇదివరకే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు కాగా… ఆలోగానే పెహల్ గాం ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో మోదీతో భేటీలో పెహల్ గాం దాడి, తదనంతర పరిణామాలపైనే చంద్రబాబు ప్రదానంగా చర్చించారు. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు..ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా మోదీని కోరారు. ఈ పోరాటంలో కేంద్రానికి ఏపీ ప్రజలు సంపూర్ణ మద్దతుగా నిలుస్తారని చంద్రబాబు తెలిపారు.
గతంలో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోదీనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాజాగా 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు తీరిగి అధికారం చేపట్టడంతో రాజధాని నిర్మాణ పనులకు రంగం సిద్ధమైంది. రాజదానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాల కోసం శాశ్వత భవన నిర్మాణాల టెండర్లను ఇప్పటికే ఖరారు చేసిన చంద్రబాబు సర్కారు.. వాటిని ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. దాదాపుగా రూ.1 లక్ష కోట్ల విలువైన పనులను ప్రారభించేందుకు రంగం సిద్ధం కాగా… వాటిని మే నెల 2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చంద్రబాబు సర్కారు.. భారీ ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 25, 2025 8:13 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…