Political News

మోదీతో బాబు భేటీ… అమరావతి 2.0 కి ఆహ్వానం!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ప్రధాని నివాసంలో మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ జరిగింది. 26 మందిని బలి తీసుకున్న ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు… ఉగ్రవాదులపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా సంపూర్ణంగా మద్దతు తెలపనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రానికి ఏపీ అండగా నిలుస్తుందని కూడా మోదీకి చంద్రబాబు తెలిపారు.

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పనుల పున:ప్రారంభానికి మోదీని ఆహ్వానించాలని ఇదివరకే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అమరావతిలో మోదీ టూర్ షెడ్యూల్ ఖరారు కాగా… ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి రాష్ట్రం తరఫున ఆహ్వానం అందించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇదివరకే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు కాగా… ఆలోగానే పెహల్ గాం ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో మోదీతో భేటీలో పెహల్ గాం దాడి, తదనంతర పరిణామాలపైనే చంద్రబాబు ప్రదానంగా చర్చించారు. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు..ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా మోదీని కోరారు. ఈ పోరాటంలో కేంద్రానికి ఏపీ ప్రజలు సంపూర్ణ మద్దతుగా నిలుస్తారని చంద్రబాబు తెలిపారు. 

గతంలో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోదీనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాజాగా 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు తీరిగి అధికారం చేపట్టడంతో రాజధాని నిర్మాణ పనులకు రంగం సిద్ధమైంది. రాజదానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాల కోసం శాశ్వత భవన నిర్మాణాల టెండర్లను ఇప్పటికే ఖరారు చేసిన చంద్రబాబు సర్కారు.. వాటిని ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. దాదాపుగా రూ.1 లక్ష కోట్ల విలువైన పనులను ప్రారభించేందుకు రంగం సిద్ధం కాగా… వాటిని మే నెల 2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చంద్రబాబు సర్కారు.. భారీ ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే.

Kumar

Recent Posts

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

1 hour ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

2 hours ago

వంద దేవుళ్ళు కలిసి హిట్ ఇస్తారా

వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…

2 hours ago

టాక్సిక్ చుట్టూ వలయం బిగుస్తోంది

అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…

3 hours ago

స్లమ్ డాగ్ … పూరి కొత్త మార్కు

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…

6 hours ago

విశాఖ స్టీల్‌: ఆది నుంచి ప్ర‌మాద‌పుటంచునే

ఆంధ్రుల హ‌క్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడ‌ల‌ను ఏకం చేసిన ఉద్య‌మం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు క‌ర్మాగారం.. గ‌త రెండు…

9 hours ago