రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రోజు(గురువారం) ఏఐపై నిర్వహించిన వర్క్షాపులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ ఆధారిత వస్తువుల ఉత్పత్తులను..ఏయే రంగాలను ప్రభావితం చేయనుందనే వివరాలను ఆయన తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో వచ్చే మార్పులను చంద్రబాబుకు పలువురు ఐటీ నిపుణులు వెల్లడించారు.
అయితే.. ఎంత మార్పు వచ్చినా.. దానికి తగిన విధంగా నైపుణ్యశిక్షణ ఇచ్చేలా చూడాలని .. ఉద్యోగాల సమస్య తలెత్తకుండా వ్యవహరించాలని చంద్రబాబు వారికి సూచించారు. ఏఐతో పంటలను కాపాడుకునే ప్రక్రియకు ఉత్తరాది రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. డ్రోన్లను వినియోగించి..ఏఐ సాంకేతికతతో పంటలకు పురుగు మందుల పిచికారీతోపాటు.. తెగుళ్లను కూడా గుర్తించే అవకాశం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలోనూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఏఐ ఆధారిత వస్తువుల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వ్వయసాయ పనుల్లో పాల్గొనే మహిళలకు.. ఏఐ ద్వారా డ్రోన్లను వినియోగించే శిక్షణ ఇవ్వడం ద్వారా.. మెరుగైన ఉత్పత్తులు సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే ఐటీ రంగంలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఏఐలో మరింత శిక్షణ ఇచ్చేలా చూడాలని సూచించారు.
రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకుతమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా ఏఐపై 5వ తరగతి నుంచే అవగాహన కల్పించడం ద్వారా.. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. దీనికి స్టార్టప్ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ దిశగా మంచి స్టార్టప్ లను కూడా.. ఎంపిక చేసి.. వాటికి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
This post was last modified on April 24, 2025 10:02 pm
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…