Political News

పహల్గామ్ దాడి: ఐదుగురు ఉగ్రవాదుల గుర్తింపు… ముగ్గురూ పాక్‌కు చెందినవారే!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి దర్యాప్తులో కీలక పురోగతి నమోదైంది. బైసరన్ మైదానంలో అమాయక పర్యాటకులపై జరిగిన కాల్పులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. ఇందులో ముగ్గురు పాకిస్తాన్‌ లు కాగా, ఇద్దరు జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. దాడి అనంతరం వీరు పీర్ పంజాల్ పర్వతాల్లోకి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు.

గుర్తించబడిన పాక్ ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ అలియాస్ మూసా, సులేమాన్ షా అలియాస్ యూనస్, అబు తల్హా అలియాస్ ఆసిఫ్. ఇద్దరు స్థానికులు అనంతనాగ్‌కి చెందిన ఆదిల్ గురి, పుల్వామా వాసి అహ్సాన్. వీరిద్దరూ 2018లో పాక్ వెళ్లి శిక్షణ పొందారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ దాడిలో పాలుపంచుకున్న ఆసిఫ్ ఫౌజీ ఇప్పటికే పూంచ్‌ దాడితోపాటు పలువురు సైనికుల హత్యలకూ సంబంధం ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక దర్యాప్తులో పహల్గామ్ దాడి సమయంలో ఉగ్రవాదులు మతంపై దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. మగవారిని టార్గెట్ చేస్తూ, మతాన్ని నిరూపించుకునేలా ప్రశ్నలు వేసి అనంతరం కాల్చినట్లు ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాల ద్వారా తేలింది. అక్కడ సీసీటీవీలు లేకపోవడంతో బాధితుల కథనాలే దర్యాప్తుకు ఆధారమవుతున్నాయి.

ఇప్పటికే ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లు విడుదల చేసిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు, వారిని పట్టించుకునే వారికి రూ. 20 లక్షల రివార్డు ప్రకటించారు. ముఖ్యంగా మూసా పేరుతో పనిచేస్తున్న ఆసిఫ్ ఫౌజీపై కేంద్ర నిఘా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. అతను ఈ ఏడాది పూంచ్ దాడిలోనూ కీలకంగా వ్యవహరించినట్టు అంచనా. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారికంగా చేపట్టింది. ఎన్ఐఏ అధికారి విజయ్ సఖారే నేతృత్వంలో ప్రత్యేక బృందం శ్రీనగర్‌లో విచారణను పర్యవేక్షిస్తోంది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ప్రమేయం ఉన్నదన్న కోణంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

This post was last modified on April 24, 2025 11:04 am

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

4 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

6 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

7 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

7 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

7 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

8 hours ago