వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేయ డమేరాజకీయం అనుకున్నారు. అలానే చేశారు. అధికారం పోయింది.. కొందరు ఇతర పార్టీల్లోకి వచ్చి విజయం దక్కించుకున్నారు. మరికొందరు సొంత పార్టీలోనే ఉండిపోయారు. కానీ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా.. నాయకులు కొందరు వ్యవహరిస్తున్నారు. దీంతో వారికి వారు తమ గోతులు తామే తీసుకుంటూ.. పార్టీకి కూడా తీస్తున్నారు.
ఉదాహరణకు.. ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, ఆర్కే రోజా, మల్లాది విష్ణు సహా.. అనంతపురం వైసీపీ నాయకుల్లో కొందరు తమ పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. దీంతో వారంతా మైనస్ అవుతున్నారు. పైగా పార్టీని కూడా మైనస్ చేస్తున్నారు. తరచుగా పవన్ పై విరుచుకుపడిన ద్వారంపూడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి భారీ ఎదురు దెబ్బే తగిలింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రవాణా ఉచ్చు బిగుసుకుంటున్న క్రమంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాలు.. స్థానికంగా ఉన్న మిత్రుల ద్వారా చెప్పించి.. ఆయన ప్రస్తుతానికి బయట పడ్డారు.
అయితే.. ఈ విషయాన్ని ద్వారంపూడి మరిచిపోయి… మళ్లీ గత నాలుగు రోజులుగా.. పవన్పై సోషల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు. తన పేరుబయటకు రాకుండా.. తన అనుచరులతో కార్యక్రమం నడిపిస్తున్నారు. ఇక, రోజా సంగతి అప్పుడు.. ఇప్పుడు మారలేదు. తాను ఓడానని కూడా ఆమె భావించ కపోవడం గమనార్హం. ఈవీఎంలే.. గాలి భాను ప్రకాష్రెడ్డిని నగరిలో గెలిపించాయని.. చెప్పుకురావడం ఆమె గడుసు తనానికి నిదర్శనం. ప్రజాతీర్పును కూడా.. పట్టించుకునే పరిస్థితిలో రోజా లేరు.
ఇక, అనంతపురానికి చెందిన కొందరు నాయకులు.. పార్టీ వ్యవహారాలను తప్పుబడుతున్నారు. వాస్తవానికి.. ఓడిపోయి ఏడాది అయినా.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ వైసీపీపైనే చురకలు అంటిస్తున్నారు. మంచి చెప్పడాన్ని ఎవరూ తప్పుబట్టరు. సూచనలు కూడా.. చేయొచ్చు. కానీ.. పార్టీని బోనులో ఎక్కించేలా వ్యవహరిస్తున్నారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. రాజమండ్రి రూరల్లో పోటీ చేసి ఓడిపోయిన వేణు కూడా.. తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారు. వెరసి.. వీరివల్ల పార్టీకి ప్రయోజనం కంటే.. మరింత డ్యామేజీనే జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on April 24, 2025 8:39 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…