వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేయ డమేరాజకీయం అనుకున్నారు. అలానే చేశారు. అధికారం పోయింది.. కొందరు ఇతర పార్టీల్లోకి వచ్చి విజయం దక్కించుకున్నారు. మరికొందరు సొంత పార్టీలోనే ఉండిపోయారు. కానీ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా.. నాయకులు కొందరు వ్యవహరిస్తున్నారు. దీంతో వారికి వారు తమ గోతులు తామే తీసుకుంటూ.. పార్టీకి కూడా తీస్తున్నారు.
ఉదాహరణకు.. ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, ఆర్కే రోజా, మల్లాది విష్ణు సహా.. అనంతపురం వైసీపీ నాయకుల్లో కొందరు తమ పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. దీంతో వారంతా మైనస్ అవుతున్నారు. పైగా పార్టీని కూడా మైనస్ చేస్తున్నారు. తరచుగా పవన్ పై విరుచుకుపడిన ద్వారంపూడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి భారీ ఎదురు దెబ్బే తగిలింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రవాణా ఉచ్చు బిగుసుకుంటున్న క్రమంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాలు.. స్థానికంగా ఉన్న మిత్రుల ద్వారా చెప్పించి.. ఆయన ప్రస్తుతానికి బయట పడ్డారు.
అయితే.. ఈ విషయాన్ని ద్వారంపూడి మరిచిపోయి… మళ్లీ గత నాలుగు రోజులుగా.. పవన్పై సోషల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు. తన పేరుబయటకు రాకుండా.. తన అనుచరులతో కార్యక్రమం నడిపిస్తున్నారు. ఇక, రోజా సంగతి అప్పుడు.. ఇప్పుడు మారలేదు. తాను ఓడానని కూడా ఆమె భావించ కపోవడం గమనార్హం. ఈవీఎంలే.. గాలి భాను ప్రకాష్రెడ్డిని నగరిలో గెలిపించాయని.. చెప్పుకురావడం ఆమె గడుసు తనానికి నిదర్శనం. ప్రజాతీర్పును కూడా.. పట్టించుకునే పరిస్థితిలో రోజా లేరు.
ఇక, అనంతపురానికి చెందిన కొందరు నాయకులు.. పార్టీ వ్యవహారాలను తప్పుబడుతున్నారు. వాస్తవానికి.. ఓడిపోయి ఏడాది అయినా.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ వైసీపీపైనే చురకలు అంటిస్తున్నారు. మంచి చెప్పడాన్ని ఎవరూ తప్పుబట్టరు. సూచనలు కూడా.. చేయొచ్చు. కానీ.. పార్టీని బోనులో ఎక్కించేలా వ్యవహరిస్తున్నారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. రాజమండ్రి రూరల్లో పోటీ చేసి ఓడిపోయిన వేణు కూడా.. తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారు. వెరసి.. వీరివల్ల పార్టీకి ప్రయోజనం కంటే.. మరింత డ్యామేజీనే జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on April 24, 2025 8:39 am
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…