Political News

వైసీపీలో వీరింతే.. మారలేదు…!

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించారు. నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాట అనేయ డ‌మేరాజ‌కీయం అనుకున్నారు. అలానే చేశారు. అధికారం పోయింది.. కొంద‌రు ఇత‌ర పార్టీల్లోకి వ‌చ్చి విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రికొంద‌రు సొంత పార్టీలోనే ఉండిపోయారు. కానీ, చింత చ‌చ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్టుగా.. నాయ‌కులు కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వారికి వారు త‌మ గోతులు తామే తీసుకుంటూ.. పార్టీకి కూడా తీస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఆర్కే రోజా, మ‌ల్లాది విష్ణు స‌హా.. అనంత‌పురం వైసీపీ నాయకుల్లో కొంద‌రు త‌మ పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. దీంతో వారంతా మైన‌స్ అవుతున్నారు. పైగా పార్టీని కూడా మైన‌స్ చేస్తున్నారు. త‌ర‌చుగా ప‌వ‌న్ పై విరుచుకుప‌డిన ద్వారంపూడికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ నుంచి భారీ ఎదురు దెబ్బే త‌గిలింది. కాకినాడ పోర్టులో రేష‌న్ బియ్యం ర‌వాణా ఉచ్చు బిగుసుకుంటున్న క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లతో ఉన్న ప‌రిచ‌యాలు.. స్థానికంగా ఉన్న మిత్రుల ద్వారా చెప్పించి.. ఆయ‌న ప్ర‌స్తుతానికి బ‌య‌ట ప‌డ్డారు.

అయితే.. ఈ విష‌యాన్ని ద్వారంపూడి మ‌రిచిపోయి… మ‌ళ్లీ గ‌త నాలుగు రోజులుగా.. ప‌వ‌న్‌పై సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు. త‌న పేరుబ‌య‌ట‌కు రాకుండా.. త‌న అనుచ‌రుల‌తో కార్య‌క్ర‌మం న‌డిపిస్తున్నారు. ఇక‌, రోజా సంగ‌తి అప్పుడు.. ఇప్పుడు మార‌లేదు. తాను ఓడాన‌ని కూడా ఆమె భావించ క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈవీఎంలే.. గాలి భాను ప్ర‌కాష్‌రెడ్డిని న‌గ‌రిలో గెలిపించాయ‌ని.. చెప్పుకురావ‌డం ఆమె గ‌డుసు త‌నానికి నిద‌ర్శ‌నం. ప్ర‌జాతీర్పును కూడా.. ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో రోజా లేరు.

ఇక‌, అనంత‌పురానికి చెందిన కొంద‌రు నాయ‌కులు.. పార్టీ వ్య‌వ‌హారాల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. వాస్త‌వానికి.. ఓడిపోయి ఏడాది అయినా.. ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే ఇప్ప‌టికీ వైసీపీపైనే చుర‌క‌లు అంటిస్తున్నారు. మంచి చెప్ప‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. సూచ‌న‌లు కూడా.. చేయొచ్చు. కానీ.. పార్టీని బోనులో ఎక్కించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. రాజ‌మండ్రి రూర‌ల్‌లో పోటీ చేసి ఓడిపోయిన వేణు కూడా.. తీరు మార్చుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వెర‌సి.. వీరివ‌ల్ల పార్టీకి ప్ర‌యోజ‌నం కంటే.. మ‌రింత డ్యామేజీనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 24, 2025 8:39 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

2 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

6 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

10 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

10 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

11 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

11 hours ago