Political News

వైసీపీలో వీరింతే.. మారలేదు…!

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించారు. నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాట అనేయ డ‌మేరాజ‌కీయం అనుకున్నారు. అలానే చేశారు. అధికారం పోయింది.. కొంద‌రు ఇత‌ర పార్టీల్లోకి వ‌చ్చి విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రికొంద‌రు సొంత పార్టీలోనే ఉండిపోయారు. కానీ, చింత చ‌చ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్టుగా.. నాయ‌కులు కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వారికి వారు త‌మ గోతులు తామే తీసుకుంటూ.. పార్టీకి కూడా తీస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఆర్కే రోజా, మ‌ల్లాది విష్ణు స‌హా.. అనంత‌పురం వైసీపీ నాయకుల్లో కొంద‌రు త‌మ పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. దీంతో వారంతా మైన‌స్ అవుతున్నారు. పైగా పార్టీని కూడా మైన‌స్ చేస్తున్నారు. త‌ర‌చుగా ప‌వ‌న్ పై విరుచుకుప‌డిన ద్వారంపూడికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ నుంచి భారీ ఎదురు దెబ్బే త‌గిలింది. కాకినాడ పోర్టులో రేష‌న్ బియ్యం ర‌వాణా ఉచ్చు బిగుసుకుంటున్న క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లతో ఉన్న ప‌రిచ‌యాలు.. స్థానికంగా ఉన్న మిత్రుల ద్వారా చెప్పించి.. ఆయ‌న ప్ర‌స్తుతానికి బ‌య‌ట ప‌డ్డారు.

అయితే.. ఈ విష‌యాన్ని ద్వారంపూడి మ‌రిచిపోయి… మ‌ళ్లీ గ‌త నాలుగు రోజులుగా.. ప‌వ‌న్‌పై సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు. త‌న పేరుబ‌య‌ట‌కు రాకుండా.. త‌న అనుచ‌రుల‌తో కార్య‌క్ర‌మం న‌డిపిస్తున్నారు. ఇక‌, రోజా సంగ‌తి అప్పుడు.. ఇప్పుడు మార‌లేదు. తాను ఓడాన‌ని కూడా ఆమె భావించ క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈవీఎంలే.. గాలి భాను ప్ర‌కాష్‌రెడ్డిని న‌గ‌రిలో గెలిపించాయ‌ని.. చెప్పుకురావ‌డం ఆమె గ‌డుసు త‌నానికి నిద‌ర్శ‌నం. ప్ర‌జాతీర్పును కూడా.. ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో రోజా లేరు.

ఇక‌, అనంత‌పురానికి చెందిన కొంద‌రు నాయ‌కులు.. పార్టీ వ్య‌వ‌హారాల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. వాస్త‌వానికి.. ఓడిపోయి ఏడాది అయినా.. ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే ఇప్ప‌టికీ వైసీపీపైనే చుర‌క‌లు అంటిస్తున్నారు. మంచి చెప్ప‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. సూచ‌న‌లు కూడా.. చేయొచ్చు. కానీ.. పార్టీని బోనులో ఎక్కించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. రాజ‌మండ్రి రూర‌ల్‌లో పోటీ చేసి ఓడిపోయిన వేణు కూడా.. తీరు మార్చుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వెర‌సి.. వీరివ‌ల్ల పార్టీకి ప్ర‌యోజ‌నం కంటే.. మ‌రింత డ్యామేజీనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 24, 2025 8:39 am

Share
Show comments
Published by
Satya
Tags: YCP

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago