ఉమ్మడి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు.. పార్టీ కోసం అనేక మంది నాయకుల పని చేశారు. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత.. ఇక, ఆపార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నాటీటతయకులు.. ఒకప్పుడు వైసీపీ జెండా కట్టిన వారు.. వైసీపీ రాజీనామా చేశారు. వీరంతా త్వరలోనే టీడీపీ బాట పట్టనున్నారు.
గుడివాడలో కొడాలి నాని వైసీపీలోకి రాకముందు నుంచి మండలి హనుమంతరావు.. ఆయన పరివారం.. సహా.. పలు మండలాల నాయకులు ఆ పార్టీకి అండగా ఉన్నాయి. తర్వాత.. నానీ విజయంలోనూ వీరు కీలక పాత్ర పోషించారు. గతంలో మండలి హనుమంతరావు.. కాంగ్రెస్లో ఉండగా.. వైసీపీ ఆవిర్భావం తర్వాత.. ఆయన కాంగ్రెస్ను వీడి వైసీపీ బాట పట్టారు. ఇక, కొడాలి నాని అనుచరుడిగా.. జగన్కు వీరాభిమాని కూడా పేరు తెచ్చుకున్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని.. ప్రజల సమస్యలను పట్టించుకుని పరిష్కరించాలని.. మండలి భావించేవారు. దీంతో కొడాలి నాని వర్గంలో ఉన్నప్పటికీ.. విభీషణుడి పాత్రను పోషించారు. ఇది.. ఆయనకు.. వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించినా.. ప్రజలకు మాత్రం సరైన నాయకుడిగా ఆయనను చేరువ చేసిం ది. ప్రస్తుతం నాని యాక్టివ్గా లేకపోవడంతోపాటు.. వైసీపీ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో మండలి హనుమంతరావు సహా సుమారు 500 మంది కార్యకర్తలు.. వైసీపీని వీడారు.
ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు వెనిగండ్ల రాము సారథ్యంలో వారు సైకిల్ ఎక్కనున్నట్టు తెలుస్తోంది. తరచుగా రాము చేస్తున్న పనులను మెచ్చుకోవడం.. ఎమ్మెల్యేగా రాము స్థానిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం వంటివి హనుమంతరావును టీడీపీకి చేరువ చేశాయి. ఈ నేపథ్యంలో గుడివాడ వైసీపీ కొలాప్సేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 23, 2025 7:05 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…