ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన వీరయ్య చౌదరి ఇంటికి వెళ్లి మృత దేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృత దేహంపై స్వయంగా టీడీపీ జెండాను కప్పారు. అనంతరం.. కొద్ద దూరం అంతిమయాత్రలోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ హంతకులను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని శపథం చేశారు. “53 చోట్ల దారుణంగా కత్తితో పొడిచారు. వీళ్లు మనుషులేనా? కాదు.. మృగాలు. ఇలాంటివారికి సమాజంలో ఉండే అర్హత లేదు. వీరితో సమాజానికే కాదు.. రాష్ట్రానికి కూడా ప్రమాదం. కరుడు గట్టిన నేరస్థులు కూడా ఇంత దారుణం చేయరు. ఇలాంటివారిని ఏరేయాల్సి ఉంది. 12 మంది బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశాం” అని చంద్రబాబు తెలిపారు.
సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో 100 రోజులు పాల్గొని పాదయాత్ర చేశారని తెలిపారు. అదేవిధంగా రాజధాని రైతుల ఉద్యమంలోనూ ఆయన పొల్గొన్నారని చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టించిన వీరయ్య చౌదరి ని హత్య చేసిన విషయం తాను ఢిల్లీ పర్యటనలో ఉండగానే తెలిసిందని చెప్పారు. మంచినాయకుడిని కోల్పాయామన్న ఆవేదన బాథ తనలో ఎప్పటికీ ఉండిపోతుందన్నారు.
సమాచారం చెప్పండి!
ఈ సందర్భంగా వీరయ్య చౌదరి హంతకులను గమనించిన వారు.. ఈ విషయాలు తెలిసిన వారు.. అనుమానితుల సమాచారం గురించి చెప్పాలని చంద్రబాబు విన్నవించారు. ఈ నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబరును ఆయన ఇచ్చారు. 9121104784 నెంబరు కు ఫోన్ చేసి.. లేదా వాట్సాప్లో సమాచారం ఇవ్వాలని.. ఎవరూ భయ పడాల్సిన అవసరం లేదని.. ప్రబుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు.
This post was last modified on April 23, 2025 6:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…