ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నాగులుప్పలపాడు మండల టిడిపి అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన వీరయ్య చౌదరిని గుర్తు తెలియని దుండగులు పాశవికంగా హతమార్చారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరి ఉండగా కత్తులతో నలుగురు వ్యక్తులు దాడి చేసి హత మార్చారు.
ఈ క్రమంలోనే వీరయ్య చౌదరి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే హోం మంత్రి అనిత, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి సమీక్షించారు. ఆ నలుగురు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అనిత చెప్పారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం తాను ఘటనా స్థలానికి వచ్చానని అనిత వెల్లడించారు.
నిందితుల కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని , సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును త్వరలో ఛేదిస్తామని అనిత చెప్పారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, రాజకీయ కక్షలు, వ్యక్తిగత కారణాలు…ఇలా అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు మేనల్లుడు అయిన వీరయ్య చౌదరి అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on April 23, 2025 3:23 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…