టీడీపీ నిర్వహించ తలపెట్టిన మహానాడు ఈ దఫా పంబరేగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. పోయి పోయి.. వైసీపీ అధినేత జగన్ ఇలాకాలో పెడుతున్న ఈ మహానాడుకు చాలా విశేషాలు ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు 75వ సంవత్సరం పూర్తి చేసుకోవడంతోపాటు.. ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రికార్డును సృష్టించారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న మహానాడుకు.. అతిరథులను కూడా ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.
ఎన్డీయే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలను ఈ దఫా మహానాడుకు ఆహ్వానిస్తారని సమాచారం. సాధారణంగా ఒక పార్టీ కార్యక్రమానికి ఎంత విధేయులైనా.. మిత్రపక్షాలైనా..ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించరు. కానీ…. జనసేన నిర్వహించిన ఆవిర్భావ సభకు టీడీపీ నుంచి కూడా ఒకరిద్దరు నేతలకు ఆహ్వానాలు అందాయి. చంద్రబాబు సైతం వారిని పంపించారు. అలానే .ఇప్పుడు .. బీజేపీ నుంచి మహానాడుకు కేంద్ర మంత్రులుగా ఉన్న జేపీ నడ్డా, అమిత్షాలను ఆహ్వానించనున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో పార్టీ పరంగా బీజేపీకి ఇస్తున్న మద్దతు.. సుదీర్ఘకాలం పాటు తమ బంధం అవసరం.. వంటి విషయాలపై చంద్రబాబు ఈ వేదికగా ప్రజలకు వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ముఖ్యంగా వచ్చే 25 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలుతీసుకుంటారని సమాచారం. ఈ విషయంలో యువతకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసే ప్రతిపాదనకు మహానాడు వేదికగా మారనుందని సీనియర్లు చెబుతున్నారు.
అదేసమయంలో మహానాడుకు ఈ దఫా పెద్ద ప్రాంగణాన్ని ఎంపిక చేస్తున్నారు. సుమారు 10 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించనున్నారు. వాస్తవానికి పార్టీకి 15 లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయి. వీరిలో సగం మందినైనా తరలించినా. . జిల్లానుంచి వచ్చేవారు.. మరికొందరు ఉంటారని భావిస్తున్నారు. సుదీర్ఘరాజకయ భవితవ్యానికి సంబంధించి చంద్రబాబు పక్కా ప్రణాళికలను ఆవిష్కరించున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ మహానాడు టీడీపీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టంగా మారనుందని అంటున్నారు.
This post was last modified on April 23, 2025 1:42 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…