Political News

మ‌హానాడు.. పొలిటిక‌ల్‌ పంబ‌రేగేలా..!

టీడీపీ నిర్వ‌హించ త‌ల‌పెట్టిన మ‌హానాడు ఈ ద‌ఫా పంబ‌రేగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పోయి పోయి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకాలో పెడుతున్న ఈ మ‌హానాడుకు చాలా విశేషాలు ఉన్నాయి. పార్టీ అధినేత చంద్ర‌బాబు 75వ సంవత్సరం పూర్తి చేసుకోవ‌డంతోపాటు.. ఆయన సుదీర్ఘ‌కాలంగా పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్న రికార్డును సృష్టించారు. ఈ క్ర‌మంలో నిర్వ‌హిస్తున్న మ‌హానాడుకు.. అతిర‌థుల‌ను కూడా ఆహ్వానించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఎన్డీయే కూట‌మిలోని కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఈ ద‌ఫా మ‌హానాడుకు ఆహ్వానిస్తార‌ని స‌మాచారం. సాధార‌ణంగా ఒక పార్టీ కార్య‌క్ర‌మానికి ఎంత విధేయులైనా.. మిత్ర‌ప‌క్షాలైనా..ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను ఆహ్వానించ‌రు. కానీ…. జ‌న‌సేన నిర్వ‌హించిన ఆవిర్భావ స‌భ‌కు టీడీపీ నుంచి కూడా ఒక‌రిద్ద‌రు నేత‌ల‌కు ఆహ్వానాలు అందాయి. చంద్ర‌బాబు సైతం వారిని పంపించారు. అలానే .ఇప్పుడు .. బీజేపీ నుంచి మ‌హానాడుకు కేంద్ర మంత్రులుగా ఉన్న జేపీ న‌డ్డా, అమిత్‌షాల‌ను ఆహ్వానించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో పార్టీ ప‌రంగా బీజేపీకి ఇస్తున్న మ‌ద్ద‌తు.. సుదీర్ఘ‌కాలం పాటు త‌మ బంధం అవ‌స‌రం.. వంటి విష‌యాలపై చంద్ర‌బాబు ఈ వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, ముఖ్యంగా వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని కీల‌క నిర్ణ‌యాలుతీసుకుంటార‌ని స‌మాచారం. ఈ విష‌యంలో యువ‌త‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేసే ప్ర‌తిపాద‌న‌కు మ‌హానాడు వేదిక‌గా మార‌నుందని సీనియ‌ర్లు చెబుతున్నారు.

అదేస‌మ‌యంలో మ‌హానాడుకు ఈ ద‌ఫా పెద్ద ప్రాంగ‌ణాన్ని ఎంపిక చేస్తున్నారు. సుమారు 10 ల‌క్ష‌ల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై ప్ర‌త్యేకంగా మంత్రుల క‌మిటీని నియ‌మించ‌నున్నారు. వాస్త‌వానికి పార్టీకి 15 ల‌క్ష‌ల మంది స‌భ్య‌త్వాలు ఉన్నాయి. వీరిలో స‌గం మందినైనా త‌ర‌లించినా. . జిల్లానుంచి వ‌చ్చేవారు.. మరికొంద‌రు ఉంటార‌ని భావిస్తున్నారు. సుదీర్ఘ‌రాజ‌క‌య భ‌విత‌వ్యానికి సంబంధించి చంద్ర‌బాబు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను ఆవిష్క‌రించున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ మ‌హానాడు టీడీపీ చ‌రిత్రలోనే ఒక కీల‌క ఘ‌ట్టంగా మార‌నుంద‌ని అంటున్నారు.

This post was last modified on April 23, 2025 1:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 minutes ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

1 hour ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

1 hour ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago