Political News

పహల్గామ్‌ మార‌ణ హోమానికి మూడు కార‌ణాలు!

జ‌మ్ముక‌శ్మీర్ లోని పహల్గామ్‌ మార‌ణ హోమం.. దేశాన్నే కాదు.. ప్ర‌పంచ దేశాల‌ను కూడా కుదిపేస్తోంది. దేశంలో ఉగ్ర‌వాదానికి చాలా మ‌టుకు తుద‌ముట్టించామ‌ని.. ఇప్పుడు అంత‌ర్గ‌త శ‌త్రువుల‌తో(రాజ‌కీయ నేత‌లు) పోరాడుతున్నామ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం.. ఏపీ స‌హా ప‌లు ప్రాంతాల‌కు చెందిన ప‌ర్య‌ట‌కులు ఉగ్ర‌దాడుల్లో ప్రాణాలు కోల్పోవ‌డం.. మ‌రో వంద‌ల సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు స్థానికంగా చిక్కుకు పోవ‌డం వంటివి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి.. ఇద్ద‌రు మృతి చెందారు. నెల్లూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ఒక‌రు, విశాఖ‌కు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఒక‌రు ఉగ్ర‌దాడుల్లో ప్రాణాలు కోల్పాయారు. ఇక‌, ఈ మార‌ణ హోమం విష‌యం తెలిసిన వెంట‌నే ప్ర‌ధాని మోడీ త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని పాకిస్థాన్ మీదుగా రాకుండా.. ప్ర‌త్యామ్నాయ మార్గంలో భార‌త్‌కు చేరుకున్నారు. ఇదిలావుంటే.. అస‌లు పహల్గామ్‌ మార‌ణ హోమానికి కార‌ణాలు ఏంటి? అంత‌ర్గ‌త ఉదాశీన‌తేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఆర్మీకి చెందిన మాజీ సైనికాధికారులు.

1) ఇంటెలిజెన్స్ నివేదిక‌ల‌ను ప‌ట్టించుకోకపోవ‌డం: ఈ విష‌యాన్ని చాలా మంది సీనియ‌ర్ అధికారులు త‌ప్పుబ‌డుతున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చి 15 రోజులు అయింద‌ని.. అయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ అధికారులు ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతున్నారు. పహల్గామ్‌ లో ఏమాత్రం ఇబ్బంది లేద‌న్న పాత నివేదిక‌ల‌ను ప‌ట్టుకుని వేలాడార‌న్న‌ది వారు చెబుతున్న మాట‌. ఈ అతిశ‌య‌మే ఇప్పుడు కొంప‌ముంచింద‌ని అంటున్నారు.

2) ఆర్మీ రిక్రూట్‌మెంట్లు లేక‌పోవ‌డం: క‌రోనా త‌ర్వాత‌.. దేశంలో నేరుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్స్‌ను నిలిపివేశారు. అగ్నివీర్‌ను తీసుకువ‌చ్చినా.. వివాదాల‌సుడిలో చిక్కుకోవ‌డం.. వారంతా కొత్త‌వారు కావ‌డంతో స‌రైన రీతిలో బ‌ల‌గాల‌ను మోహ‌రించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని సీనియ‌ర్ రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. పైగా చైనాతోనే ముప్పు ఎక్కువ‌గా ఉంద‌న్న కార‌ణంగా.. చైనా స‌రిహ‌ద్దుల్లోనే సైన్యాన్నిఎక్కువ‌గా మోహ‌రించిన ఫ‌లితంగా ఇప్పుడు ఇప్పుడు ఈ దుస్థితి వ‌చ్చిందని అంటున్నారు.

3) విధాన ప‌ర‌మైన నిర్ణ‌యం: జ‌మ్ము క‌శ్మీర్‌ను విడ‌దీసి.. కేంద్ర పాలిత ప్రాంతంగా జ‌మ్ములోని కొంత భాగాన్ని కేటాయించినా.. అక్క‌డ శాంతి భ‌ద్ర‌తల స‌మ‌స్య కొన‌సాగుతోంది. దీనికి తోడు.. స్థానికంగా రాజ‌కీయాలు అస్థిర‌త్వంతో కూడుకుని ఉన్నాయి. ఈ నిర్ణ‌యం ఫ‌లితంగానే ఉగ్ర‌వాదుల‌కు పహల్గామ్‌ మార్గం రెడ్ కార్పెట్ ప‌రిచిన‌ట్టు అయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా మోడీ పాల‌న‌ ప‌ది సంవ‌త్స‌రాల్లో ఇదే భారీ ఉగ్ర‌దాడిగా చెబుతున్నారు.

This post was last modified on April 23, 2025 1:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

1 hour ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

4 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago