Political News

బాబు గారూ.. మూల్యం చెల్లించక తప్పదు: అంబటి రాంబాబు

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై విపక్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును ఖండించడంతో పాటుగా.. ఆయనను కూటమి సర్కారే కక్షపూరితంగా అరెస్టు చేయించిందని సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఈ అరెస్టులకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ అంబటి ఏకంగా టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడుకు వార్నింగులు జారీ చేశారు. చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తూ అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

”ఎంతమందిని అరెస్టు చేస్తారు? అరెస్టు చేసి జైల్లో పెడితే… జైల్లోనే తాము చనిపోతామా? రాదా బెయిల్? ఏడాదికి అయినా వస్తుంది కదా. చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు, మీరు పెద్ద వారు. 75వ పుట్టిన రోజు జరుపుకున్న  మీరు గుర్తు పెట్టుకోండి. దీనికి తగ్గ మూల్యం చెల్లిస్తారు” అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలే చేశారు. అసలు పీఎస్ఆర్ ను అరెస్టు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కుక్కల విద్యా సాగర్ తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కోర్టును ఆశ్రయించకుండా ఉన్న కారణంగానే పీఎస్ఆర్ ను అరెస్టు చేయగలిగారు అని ఆయన ఆరోపించారు.

అయినా పీఎస్ఆర్ అరెస్టు చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే జరిగిందని కూడా అంబటి ఆరోపించారు. చంద్రబాబు అరెస్టైన సమయంలో పీఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారని, తన అరెస్టులో కీలక భూమిక పీఎస్ఆర్ దేనని చంద్రబాబు భావించారని ఆయన ఆరోపించారు. తన అరెస్టుకు కారకుడిగా నిలిచారన్న భావనతోనే పీఎస్ఆర్ ను చంద్రబాబు అరెస్టు చేయించారన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కూడా ఓ విషయాన్ని గుర్తించాలని.. టీడీపీ సర్కారే ఎల్లకాలం అధికారంలో ఉండదని ఆయన హెచ్చరించారు. మరో పార్టీ ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన పోలీసులను హెచ్చరించారు. ఐపీఎస్ లు అయినా, ఐఏఎస్ లు అయినా వారి పరిధి దాటి వ్యవహరించరని అంబటి అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం పోలీసుల తీరు అందుకు విరుద్దంగా ఉందని అంబటి ఆరోపించారు.

ఇదిలా ఉంటే… జగన్ కు ఎవరు దగ్గరగా ఉన్నా… వారంతా తమకు శత్రువులే అన్నట్లుగానే చంద్రబాబు భావిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. అసలు ఏపీలో మద్యం కుంభకోణమే జరగకున్నా.., ఎదో జరిగిందంటూ రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే అవినీతి ఎక్కడ జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అయినా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే కదా అవినీతి జరిగేది అని కూడా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న వాటికంతా చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చంద్రబాబు లేకుంటే ఆయన కుమారుడు లోకేశ్ అయినా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కూటమి సర్కారు కేవలం 11 నెలల వ్యవధిలో వచ్చిన వ్యతిరేకత దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం మీద రాలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు… అందులో భాగంగానే రోజుకు ఒకరిని అరెస్టు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఆయన ఆరోపించారు.

This post was last modified on April 22, 2025 3:11 pm

Share

Recent Posts

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

13 minutes ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

1 hour ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

4 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

4 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

5 hours ago