నాయకులన్నాక.. ప్రజల మధ్య చర్చ ఉంటుంది. వారిచ్చే మార్కులు కూడా అవసరం. ఒకప్పుడు నాయ కులు.. ప్రజల ఆలోచనలు వేరేగా ఉండేవి. ఎన్నికలకు ఏడాది ముందు నాయకులకు ప్రజల్లో మార్కులు ఎలా ఉన్నాయనే చర్చ ఉండేది. పార్టీలు కూడా..ఎన్నికలకు ముందు అప్రమత్తం అయ్యేవి. కానీ.. ఇప్పుడు అలా కాదు. ఎన్నికలకు కనీసం మూడేళ్ల నుంచే పార్టీలు, నాయకులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల్లో తమ గ్రాఫ్ పడిపోకుండా పెంచుకునే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
గత టీడీపీ అయినా.. ప్రస్తుత తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అయినా.. ఈ గ్రాఫ్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి. సమస్యల మాట ఎలా ఉన్నా.. తాము సమస్యల్లో చిక్కుకోకుండా.. జాగ్రత్తలు పడ్డాయి. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే టీడీపీ అలెర్ట్ అయింది. ఇక, బీఆర్ ఎస్ పార్టీ అయితే.. నాలుగేళ్ల ముందే అలెర్ట్ అవుతూ.. ప్రజల మధ్యకు వచ్చింది. మరి ఇలా చూసుకుంటే.. వైసీపీ అధినేత.. జగన్.. ఆయన పార్టీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నాయి?
ఇప్పటికి ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది అయింది. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు. అలాగని కూర్చుంటే.. నాయకుల గ్రాఫ్ పరిస్తితి దారుణంగా ఉండే అవకాశం ఉంది. దీనిని దృస్టిలో పెట్టుకునే.. సీఎం చంద్రబాబు తరచుగా తనను తాను పరీక్షించుకుంటున్నారు. తన పాలనను పరిశీలించుకుంటు న్నారు. తద్వారా ప్రజల్లో తన ఇమేజ్ దెబ్బతినకుండా.. గ్రాఫ్ పడిపోకుండా కూడా. . ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు.
కానీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం.. ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ గ్రాఫ్లు.. లెక్కలు వేసుకోవడం లేదు. అంతా..ఎన్నికలకు ముందు చూసుకుందాం.. అనుకున్నారో ఏమో.. తెలియదు.. కానీ, ప్రజలను పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో ఇప్పుడు గ్రాఫ్ ఢమాల్న పడిపోయిందన్న చర్చ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. చంద్రబాబు ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతుండగా.. జగన్ ఇమేజ్ అంతకు రెండింతల స్థాయిలో తగ్గుతూ వస్తోంది.
ప్రస్తుతం జగన్కు 10 శాతం మేరకు మాత్రమే పాజిటివిటీ ఉందని తెలుస్తోంది. చంద్రబాబుకు ఎన్నికలకు ముందున్న 80 శాతం పాజిటివిటీ.. కొంత తగ్గుతూ.. మరింత పెరుగుతూ.. 80 శాతం దగ్గర నిలకడగా ఉందన్న చర్చ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ అలెర్ట్ కాకపోతే.. ఎన్నికల సమయానికి మరింత పడిపోయే అవకాశం ఉందని పార్టీ నాయకులు గుసగుస లాడుతున్నారు.
This post was last modified on April 22, 2025 1:20 pm
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే…
వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా…
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…