తెలంగాణ గొప్పతనాన్ని దశదిశలా చాటుతామని చెప్పిన వారు… ఏం చేశారో.. ఏమో తెలియదుకానీ.. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి మాత్రం నిజంగానే ఆ పనిచేశారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. తెలంగాణ కీర్తిని అక్కడ రెపరెపలాడించారు. జపాన్లో ఏటా.. ఏప్రిల్ మధ్య వారం నుంచి `ఒసాకా` ఎక్స్పో నిర్వహిస్తారు. ఇది చాలా ప్రతిష్టాత్మకం. పెద్ద పెద్ద కంపెనీలే కాదు.. పెద్ద పెద్ద దేశాలకు చెందిన వారే పాల్గొంటారు.
ఇప్పటి వరకు మన దేశం నుంచి ఏ ఒక్క రాష్ట్రానికి `ఒసాకా ఎక్స్పో`లో పాల్గొనే అదృష్టం దక్కలేదు. గత ఏడాది మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు ప్రయత్నించినా.. కొన్ని కారణాలతో ఆయా రాష్ట్రాలను నిర్వాహకులు అనుమతించలేదు. కాగా.. ఇప్పుడు తొలిసారి సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ సర్కారుకు ఒసాకాఎక్స్పో అవకాశం దక్కింది. అంతేకాదు.. అక్కడ పెవిలియన్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం చిక్కింది.
తాజాగా తెలంగాణ పెవిలియన్(ఈ ఎక్స్పో జరిగినన్నాళ్లు ఇది ఉంటుంది. పైగా అంతర్జాతీయ ఎక్స్పో మేగజైన్స్లోనూ ప్రముఖంగా ప్రచురిస్తారు)ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో పెట్టుబడులకు సువర్ణావకాశం వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లోతెలంగాణ మొదటి వరుసలో ఉందన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే.. అన్ని వనరులను అందిస్తామని చెప్పారు.
కాగా.. ఒసాకా ఎక్స్పోలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో రాష్ట్రానికి చెందిన పలు ప్రముఖ పెట్టుబడులు, అవకాశాలు, పారిశ్రామికంగా రాష్ట్రంలో అనుకూలించే పరిస్థితులు, ఏయే కంపెనీలు ఈ ఏడాది ఒప్పందం చేసుకున్నాయి… వంటి సమగ్ర వివరాలను వెల్లడించారు. సో.. మొత్తానికి తెలంగాణ పేరు తొలిసారి ఒసాకా ఎక్స్పో వినిపించడమే కాదు.. చార్మినార్ తదితర సంస్కృతులతో కూడిన ప్రదర్శన కూడా కనిపించింది.
This post was last modified on April 21, 2025 7:32 pm
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…