Political News

కూటమి నేతలకు పవన్ వార్నింగ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఓ సంచలన వ్యాఖ్య చేశారు. భూ సంబంధిత సమస్యలపై తన కార్యాలయంతో పాటుగా జనసేన నిర్వహించిన జన వాణిలకు వెల్లువెత్తిన ఫిర్యాదులపై శుక్రవారం ఆయన ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూకబ్జాలపై ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ఆయన ప్రకటించారు. కష్టపడి సంపాదించుకున్న జాగాలు, వారసత్వంగా వస్తున్న ఆస్తులను కాపాడుకునేందుకు జనం ఎంతగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటేనే చాలా బాధ కలుగుతుందని ఆయన అన్నారు.

ఈ తరహా పరిస్థితికి గత వైసీపీ సర్కారులో ఆ పార్టీ నేతలు అవలంబించిన తీరే కారణమని పవన్ ఆరోపించారు. పక్కా దస్తావేజులు ఉన్న ఆస్తులపైనా వివాదాలు సృష్టించి… ఆ వివాదాల ద్వారా ఏమాత్రం లిటిగేషన్ లేని భూములను కూడా వివాదంలోకి నెట్టేసి..వాటి ద్వారా ఆయా ఆస్తులను అన్యాక్రాంతం చేసేశారని పవన్ మండిపడ్డారు. ఈ తరహా చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనకు ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటినీ పరిష్కరించే దిశగా ఇకపై చర్యలు చేపడతానని ఆయన అన్నారు. ఇందుకోసం త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళతానని కూడా పవన్ చెప్పారు. జిల్లాల పర్యటనలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల సమక్షంలో భూ సంబంధిత ఫిర్యాదులను తానే స్వీకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయా సమస్యలను పరిష్క్రరించే దిశగా చర్యలు చేపడతానని ఆయన చెప్పారు.

జిల్లాల పర్యటనల్లో బాగంగా తొలుత కాకినాడ, విశాఖల్లో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. భూదందాలు చేసినా… ఆయా భూములకు నకిలీ దస్తావేజులు సృష్టించినా కూడా ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారాల్లో కూటమి పార్టీలకు చెందిన నేతలున్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ చర్యల ద్వారా ఇకపై ఎక్కడైనా భూదందాలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి పాలన నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు. కూటమి పాలనలో ఆయా ఆస్తులకు భరోసా కల్పించే దిశగా సాగనున్నానని తెలిపిన పవన్,అందులో బాగంగానే భూసంబంధిత సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

This post was last modified on April 19, 2025 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

31 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago