“మీ విచారణను వీడియోలు.. ఆడియోలు తీయాలని కోరుతున్నారు. అంటే.. అధికారులు మిమ్మల్ని (పిటిషనర్) కొడతారని భయపడుతున్నారా?” అని వైసీపీ ఎంపీ.. పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. వైసీపీ హయాంలో జరిగినట్టు ప్రభుత్వం పేర్కొంటున్న మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు దీనిని నేతృత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల కిందటే మిథున్రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అయితే.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి.. తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు తె చ్చుకున్నారు. కానీ, ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని చూసినా.. హైకోర్టు ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే.. తాజాగా శుక్రవారం మిథున్రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి నోటీసులు అందుకున్నారు. ఈక్రమంలో తనను విచారించే ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగు చేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా గురువారం సాయంత్రం దీనిని విచారించిన హైకోర్టు.. ఆడియో, వీడియో రికార్డింగులకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. ఎలానూ సిట్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉంటాయని.. అవి అన్నింటినీ రికార్డు చేస్తాయని తెలిపింది. అయితే.. సొంతగా ఇద్దరు న్యాయవాదులను వెంట తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు కొడతారని భయమా? అని ఎంపీ తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది.
అయితే.. తమకు అలాంటి భయం లేదని.. కానీ, ఆధారాల కోసం రికార్డు చేయాలని కోరుతు న్నామన్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి.. ఇతర మాధ్యమాలు అవసరం లేదని పేర్కొంది. అదేసమయంలో సీసీ కెమెరాలను ముందుగానే చెక్ చేసుకోవాలని.. విచారణ ముగిసిన తర్వాత.. సాంకేతిక కారణాలు చూపుతూ.. అవి రికార్డు కాలేదని చెప్పడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించింది.
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…
గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…
బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…