Political News

అధికారులు కొడ‌తార‌ని భ‌య‌మా ఎంపీ?

“మీ విచార‌ణ‌ను వీడియోలు.. ఆడియోలు తీయాల‌ని కోరుతున్నారు. అంటే.. అధికారులు మిమ్మ‌ల్ని (పిటిష‌నర్‌) కొడ‌తార‌ని భ‌య‌ప‌డుతున్నారా?” అని వైసీపీ ఎంపీ.. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఉద్దేశించి హైకోర్టు ప్ర‌శ్నించింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగినట్టు ప్ర‌భుత్వం పేర్కొంటున్న‌ మ‌ద్యం కుంభ‌కోణంపై ప్ర‌త్యేక దర్యాప్తు బృందం విచార‌ణ చేస్తోంది. విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబు దీనిని నేతృత్వం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్నాళ్ల కింద‌టే మిథున్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

అయితే.. ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. త‌న‌ను అరెస్టు చేయ‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు తె చ్చుకున్నారు. కానీ, ముంద‌స్తు బెయిల్ తెచ్చుకోవాల‌ని చూసినా.. హైకోర్టు ఇవ్వ‌క‌పోవ‌డంతో సుప్రీంకోర్టు ఆమేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే.. తాజాగా శుక్ర‌వారం మిథున్‌రెడ్డి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ముందు హాజ‌రు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి నోటీసులు అందుకున్నారు. ఈక్ర‌మంలో త‌న‌ను విచారించే ప్ర‌క్రియ‌ను ఆడియో, వీడియో రికార్డింగు చేయాల‌ని కోరుతూ.. హైకోర్టును ఆశ్ర‌యించారు.

తాజాగా గురువారం సాయంత్రం దీనిని విచారించిన హైకోర్టు.. ఆడియో, వీడియో రికార్డింగుల‌కు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని పేర్కొంది. ఎలానూ సిట్ కార్యాల‌యంలో సీసీ కెమెరాలు ఉంటాయ‌ని.. అవి అన్నింటినీ రికార్డు చేస్తాయ‌ని తెలిపింది. అయితే.. సొంత‌గా ఇద్ద‌రు న్యాయ‌వాదుల‌ను వెంట తీసుకువెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే అధికారులు కొడ‌తార‌ని భ‌య‌మా? అని ఎంపీ త‌ర‌ఫున న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది.

అయితే.. త‌మ‌కు అలాంటి భ‌యం లేద‌ని.. కానీ, ఆధారాల కోసం రికార్డు చేయాల‌ని కోరుతు న్నామ‌న్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబ‌ట్టి.. ఇత‌ర మాధ్య‌మాలు అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. అదేస‌మ‌యంలో సీసీ కెమెరాల‌ను ముందుగానే చెక్ చేసుకోవాలని.. విచార‌ణ ముగిసిన త‌ర్వాత‌.. సాంకేతిక కార‌ణాలు చూపుతూ.. అవి రికార్డు కాలేద‌ని చెప్ప‌డానికి వీల్లేద‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

This post was last modified on April 17, 2025 9:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమో

దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…

5 hours ago

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

7 hours ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

7 hours ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

7 hours ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

8 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

9 hours ago