వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు సీఎం చంద్రబాబు సౌండ్ లేకుండా చేశారు. గుడ్ ఫ్రైడేను పురస్క రించుకుని క్రిస్టియన్లు ఘనంగా నిర్వహించుకునే.. గుడ్ ఫ్రైడే సందర్భంగా సర్కారుపై విమర్శలు గుప్పించేందుకు.. జగన్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులను కూడా రెడీ చేశారు. తమ హయాంలో పాస్టర్లకు, మతాచార్యులకు నెల నెలా పింఛను రూపంలో గౌరవ వేతనం ఇచ్చామని.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. దానిని ఎత్తేశారని వారికి చెప్పాలని నిర్ణయించారు.
అయితే.. తాజాగా కూటమి సర్కారు ఈ విషయంలో జగన్కు భారీ షాక్ ఇచ్చింది. తాజాగా సర్కారు ఉత్త ర్వులు జారీ చేసింది. పాస్టర్లకు.. క్రిస్టియన్ మతాచార్యులకు.. రూ.5000 చొప్పున పింఛను, లేదా గౌరవ వేతనాన్ని పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు.. 2024కు ముందు.. వైసీపీ అమలు చేసిన దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్టు తెలిపింది. అక్కడితో కూడా ఆగకుండా.. గత ఏడాది మే నుంచి నవంబర్ వరకు లెక్కగట్టి.. సొమ్ములు ఇవ్వనున్నట్టు తెలిపింది.
అంటే.. సుమారు 7 మాసాల కాలానికి రూ.5000 చొప్పున శుక్రవారం(గుడ్ ఫ్రైడే) నాడు ఈ సొమ్మును ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒక్కొక్క పాస్టర్(లబ్ధిదారులైనవారు, ప్రభుత్వ జాబితాలో ఉన్నవారు) రూ.35 వేల చొప్పున అందుకోనున్నారు. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రూ.30 కోట్ల నిధులను కూడా విడుదల చేసినట్టు తెలిపింది. దీంతో జగన్ అండ్ టీమ్కు సౌండ్ లేకుండా పోయింది.
వాస్తవానికి వైసీపీ హయాంలో ప్రారంభమైన ఈ పథకాన్ని ఆపేయాలని కూటమి కుట్ర చేసిందంటూ.. ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయాలనిఅనుకున్న సమయంలో చంద్రబాబు సర్కారు ఊహించని విధంగా నిర్ణయం వెలువరించడంతో జగన్కు సౌండ్ లేకుండా పోయిందని కూటమి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on April 17, 2025 10:09 pm
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…