వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు సీఎం చంద్రబాబు సౌండ్ లేకుండా చేశారు. గుడ్ ఫ్రైడేను పురస్క రించుకుని క్రిస్టియన్లు ఘనంగా నిర్వహించుకునే.. గుడ్ ఫ్రైడే సందర్భంగా సర్కారుపై విమర్శలు గుప్పించేందుకు.. జగన్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులను కూడా రెడీ చేశారు. తమ హయాంలో పాస్టర్లకు, మతాచార్యులకు నెల నెలా పింఛను రూపంలో గౌరవ వేతనం ఇచ్చామని.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. దానిని ఎత్తేశారని వారికి చెప్పాలని నిర్ణయించారు.
అయితే.. తాజాగా కూటమి సర్కారు ఈ విషయంలో జగన్కు భారీ షాక్ ఇచ్చింది. తాజాగా సర్కారు ఉత్త ర్వులు జారీ చేసింది. పాస్టర్లకు.. క్రిస్టియన్ మతాచార్యులకు.. రూ.5000 చొప్పున పింఛను, లేదా గౌరవ వేతనాన్ని పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు.. 2024కు ముందు.. వైసీపీ అమలు చేసిన దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్టు తెలిపింది. అక్కడితో కూడా ఆగకుండా.. గత ఏడాది మే నుంచి నవంబర్ వరకు లెక్కగట్టి.. సొమ్ములు ఇవ్వనున్నట్టు తెలిపింది.
అంటే.. సుమారు 7 మాసాల కాలానికి రూ.5000 చొప్పున శుక్రవారం(గుడ్ ఫ్రైడే) నాడు ఈ సొమ్మును ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒక్కొక్క పాస్టర్(లబ్ధిదారులైనవారు, ప్రభుత్వ జాబితాలో ఉన్నవారు) రూ.35 వేల చొప్పున అందుకోనున్నారు. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రూ.30 కోట్ల నిధులను కూడా విడుదల చేసినట్టు తెలిపింది. దీంతో జగన్ అండ్ టీమ్కు సౌండ్ లేకుండా పోయింది.
వాస్తవానికి వైసీపీ హయాంలో ప్రారంభమైన ఈ పథకాన్ని ఆపేయాలని కూటమి కుట్ర చేసిందంటూ.. ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయాలనిఅనుకున్న సమయంలో చంద్రబాబు సర్కారు ఊహించని విధంగా నిర్ణయం వెలువరించడంతో జగన్కు సౌండ్ లేకుండా పోయిందని కూటమి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on April 17, 2025 10:09 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…