నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి అన్నగారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. దీనిని దేశంలోనే పెద్దదిగా నిర్మించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అతి పెద్ద విగ్రహంగా ఉంది. దీనిలోనే మ్యూజియం, గ్రంథాలయం, ఎగ్జిబిషన్ వంటివి కూడా ఉన్నాయి.
అయితే.. దీనికి మించిన విధంగా అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలన్నది టీడీపీ ఆలోచన. తద్వారా.. అన్నగారి కీర్తిని అజరామరంగా.. నిలిచిపోయేలా.. ప్రపంచ దేశాల నుంచి వచ్చే వారికి కూడా.. ఆయన విశేషాలు తెలిసేలా చేయాలన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం. ఈ నిర్మాణానికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే.. టీడీపీని వ్యతిరేకించే వైసీపీ కూడా.. అన్నగారిని అభిమానిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. చిక్కల్లా.. కేంద్రం నుంచి అంత పెద్ద విగ్రహానికి అనుమతి రావాల్సి ఉంటుంది. పైగా.. కేంద్రం ఇప్పటి వరకు ఇలాంటి విగ్రహాలను అనుమతించలేదు. తెలంగాణలోనూ.. అంబేడ్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తుతో నిర్మించినా.. గుజరాత్లోని వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మించి కట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో విగ్రహం ఎత్తును తగ్గించి.. డయాస్ ఎత్తును పెంచుకున్నారు. ఇది బీఆర్ ఎస్ హయాంలోనే జరిగింది.
ఇక, తమిళనాడులోనూ కరుణానిధి విగ్రహానికి అసలు అనుమతులే ఇవ్వలేదు. సాధారణంగా.. ఒక ఎత్తు వరకు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఉంటుంది. కానీ.. 100 మీటర్ల ఎత్తు దాటిన తర్వాత.. కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. విమాన రాకపోకలు.. గగన తల మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం అనుమతి ఇస్తుంది. సో.. ఈ విషయంలో పటేల్ను మించిన విగ్రహం నిర్మించేందుకు కేంద్రం ఏమేరకు అనుమతి ఇస్తుందో చూడాలి.
This post was last modified on April 17, 2025 4:31 pm
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…