Political News

అమ‌రావ‌తిలో అన్న‌గారి విగ్ర‌హం.. ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా..!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో విశ్వవిఖ్యాత న‌ట సార్వ‌భౌముడు, తెలుగువారి అన్న‌గారు.. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని స‌ర్కారు సంక‌ల్పించింది. దీనిని దేశంలోనే పెద్ద‌దిగా నిర్మించాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలో గుజ‌రాత్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ అతి పెద్ద విగ్ర‌హంగా ఉంది. దీనిలోనే మ్యూజియం, గ్రంథాల‌యం, ఎగ్జిబిష‌న్ వంటివి కూడా ఉన్నాయి.

అయితే.. దీనికి మించిన విధంగా అన్న‌గారు ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని రాజ‌ధానిలో ఏర్పాటు చేయాల‌న్న‌ది టీడీపీ ఆలోచ‌న‌. తద్వారా.. అన్న‌గారి కీర్తిని అజ‌రామ‌రంగా.. నిలిచిపోయేలా.. ప్ర‌పంచ దేశాల నుంచి వ‌చ్చే వారికి కూడా.. ఆయ‌న విశేషాలు తెలిసేలా చేయాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ఉద్దేశం. ఈ నిర్మాణానికి రాజ‌కీయంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. టీడీపీని వ్యతిరేకించే వైసీపీ కూడా.. అన్న‌గారిని అభిమానిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. చిక్క‌ల్లా.. కేంద్రం నుంచి అంత పెద్ద విగ్ర‌హానికి అనుమ‌తి రావాల్సి ఉంటుంది. పైగా.. కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి విగ్ర‌హాల‌ను అనుమతించ‌లేదు. తెలంగాణ‌లోనూ.. అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని భారీ ఎత్తుతో నిర్మించినా.. గుజ‌రాత్‌లోని వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హాన్ని మించి క‌ట్టేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో విగ్ర‌హం ఎత్తును త‌గ్గించి.. డ‌యాస్ ఎత్తును పెంచుకున్నారు. ఇది బీఆర్ ఎస్ హ‌యాంలోనే జ‌రిగింది.

ఇక‌, త‌మిళ‌నాడులోనూ క‌రుణానిధి విగ్ర‌హానికి అస‌లు అనుమ‌తులే ఇవ్వ‌లేదు. సాధార‌ణంగా.. ఒక ఎత్తు వ‌ర‌కు నిర్మించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అనుమ‌తి ఉంటుంది. కానీ.. 100 మీట‌ర్ల ఎత్తు దాటిన త‌ర్వాత‌.. కేంద్రం నుంచి అనుమ‌తి తెచ్చుకోవాల్సి ఉంటుంది. విమాన రాక‌పోక‌లు.. గ‌గ‌న త‌ల మార్గంలో ఎదుర‌య్యే ఇబ్బందులు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం అనుమ‌తి ఇస్తుంది. సో.. ఈ విష‌యంలో ప‌టేల్‌ను మించిన విగ్ర‌హం నిర్మించేందుకు కేంద్రం ఏమేర‌కు అనుమ‌తి ఇస్తుందో చూడాలి.

This post was last modified on April 17, 2025 4:31 pm

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

12 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

29 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

43 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago