ఏపీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి చాలా భిన్నంగా ఉందని, ఆయన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, పైగా పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో అంచనా వ్యయాలకు భారీగా కోత పెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో రాజకీయాల మాట ఎలా ఉన్న ప్పటికి.. మేధావులు, తటస్థ వైఖరిని అవలంభించే వారు కూడా ఒకింత ఖిన్నులవుతున్నారు. ఏపీ విషయంలో ఇంత అన్యాయం చేస్తారా? అంటూ.. ఆగ్రహావేశాలను కూడా ప్రదర్శిస్తున్నారు. నిజమే.. కేంద్రం వైఖరిని చూస్తే.. ఇలానే అనిపిస్తుంది.
గతంలో ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను అటకెక్కించారు.. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లను వెనక్కి తీసుకున్నారు(గత సర్కారు హయాంలోనే). ఇక, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనాలను కూడా కుదించేశారు. ఇవన్నీ చూస్తే.. విభజనతో ఇప్పటికే తీవ్ర ఇక్కట్లలో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి సమ్మెటపోట్లు పడుతున్నాయని అనిపిస్తుంది. మరి ఎందుకు ఇలా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి రాజకీయ నేతలు ఏవేవో.. కారణాలు చూపిస్తున్నారు. సరే..! అని నిజమో కావో వారికీ తెలియదు.
కానీ, తాజాగా ఇదే విషయంపై జాతీయస్థాయిలో మేధావులు కొన్ని ఆధారాలు చూపిస్తూ.. మోడీ అందుకే ఏపీని పక్కన పెట్టారు! అని చెబుతున్నారు. ఆ కారణాలు ఏంటంటే.. మోడీ స్వతహాగా.. ఎవరికీ ఏమీ ఉచితంగా ఇచ్చే టైపు కాదు. రాజకీయాల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు కూడా ఆయన ఎక్కడా ఏమీ ఉచితంగా ప్రవేశపెట్టిన పథకాలు గుజరాత్లోనూ మనకు కనిపించవు. ప్రజలను సోమరులుగా మార్చాలని ఆయన అనుకోరు. ఈ క్రమంలోనే ఆయన ప్రజల కోసం ఏం చేసినా.. దానిలో ప్రజల కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది.
ఆర్థికంగా ప్రజలు వారి కాళ్లపై వారు ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో మోడీ కీలక నాయకుడు. అందుకే ఆయన ఏ పథకం పెట్టినా.. ప్రజలకు ఉచితంగా ఇవ్వకుండా.. భాగస్వామ్యులను చేస్తారు. ప్రధాని జన్ధన్ యోజన, ఉజ్వల్, సుకన్య ఇలాంటి అన్ని పథకాల్లోనూ ప్రజల బాగోగులు కోరుకున్నా.. నేరుగా వారికి ప్రజాధనం పందేరం చేయలేదు. కానీ, ఏపీలో జగన్ మాత్రం ప్రజలకు పందేరం చేస్తుండడం.. ఇక్కడ ప్రజలకు ఉచితంగా డబ్బులు పంచడం, ప్రజలను నైపుణ్యాలవైపు నడిపించకపోవడం వంటివి మోడీకి సుతరామూ ఇష్టం లేదనేది మేధావుల మాట.
అయితే, ఈ విషయాన్ని మోడీ ఎక్కడా నేరుగా చెప్పడం లేదు. ఇంతగా అంటే ఏపీ ప్రభుత్వమే తాము 70 వేల కోట్లు ప్రజలకు పంచామని ప్రచారం చేస్తున్న దరిమిలా.. డబ్బున్న రాష్ట్రంగానే మోడీ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే తాను తీసుకునే నిర్ణయాలు తాను తీసుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి ఏపీ విషయంలో మోడీ వైఖరి వెనుక జగన్ అనుసరిస్తున్న వ్యూహమే ఉందని ఆధారాలతో సహా వివరిస్తున్నారు. సో.. ఇదీ సంగతి! ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి!!
This post was last modified on November 2, 2020 8:25 am
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…